WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

Friday, 27 May 2016

SIDE EFFECTS OF COOL DRINKS


అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?

*కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు:*
కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.
*కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు:*
కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.
*కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు:*
రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కోల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.
*కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు:*
ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే.
*కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు:*
గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.
మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.


Saturday, 7 November 2015

PUMPKIN SEEDS INCREASE THE SEX HEALTH POTENTIALITY - BRIEF INFORMATION ABOUT USAGE OF PUMPKIN SEEDS


గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు

మానవ మనుగడలో అతి కీలకపాత్ర పోషించేది శృంగారం. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో అది తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. తీరిక లేకపోవడం ఒకవైపు, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి పలురకాల వ్యాధులు మరోవైపు శృంగారాసక్తిని చంపేస్తున్నాయి. దాంతో ఏదో మొక్కుబడిగా పిల్లల కోసమే చాలా మంది సెక్స్‌ చేస్తున్నారు. చాలామందికి నడివయసుకొచ్చేసరికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అయితే వారు ఆ విషయమై డాక్టర్లను కలవడానికి సంకోచిస్తున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయినా.. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్‌ సామర్థ్యం కొంతవరకైనా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి గుమ్మడికాయ గింజలు.
గుమ్మడి పిక్కలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఈ పిక్కల్లో జింక్‌ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది మగవారిలో టెస్టొస్టిరాన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందని రుజువైంది. యాంటీ ఆక్సిడెంట్ సెలెనియంతో పాటు విటమిన్లు ఇ, సి, డి, కె, బి నిండి ఉన్న గుమ్మడి గింజలు శృంగార సామ్రాజ్యానికి సోపానాలు. వీర్యంలో కీలకమైన శుక్రకణాల వృద్ధికి ఈ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలోని మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు మగతనాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. శృంగార సామ్రాజ్యంలో పురుషులకు పోటీగా స్త్రీలకూ అదే స్థాయిలో గుమ్మడి గింజలు ప్రయోజనాలు అందజేస్తాయి.
సాధారణ ఆరోగ్యం విషయానికొస్తే.. మన శరీరంలో ధమనులకు దన్నుగా నిలుస్తాయి గుమ్మడి గింజలు. మూత్ర సంబంధ సమస్యల్ని నివారించడానికి శతాబ్ద కాలానికి ముందు నుంచే నాటి సంప్రదాయ వైద్యులు ఈ గింజల్ని ఉపయోగించేవారట. గుండె జబ్బుల నివారణ, కొవ్వుతో పాటుగా కిడ్నీలో రాళ్ళను కరగదీయడంలోను ఈ పిక్కల పనితీరే వేరు. ఈ గింజలను పచ్చిగా తినవచ్చు, కాస్తంత ఆలివ్ ఆయిల్‌లో వేయించుకుని కూడా తినవచ్చు.

Sunday, 1 February 2015

DAILY SIMPLE KITCHEN HEALTH TIPS WITH FRUITS AND VEGETABLES



మీకు తెలుసా

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని

 అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే 

మలబద్దకం పోతుంది.


జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది. 

మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. 

మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా

 కాపాడుతుంది.

బీట్ రూట్ రసం 'లో బీపీ ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి

 కాపాడుతుంది.

సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి

 దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం 

సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Sunday, 7 September 2014

TIPS FOR WAKING UP EARLY ENERGIZED - HEALTHY WAKING TIPS IN TELUGU


తాజాగా రోజు నిద్ర లేవలంటే.....!

కొంతమందికి రాత్రి 10 కొట్టగానే కళ్లు మూతలుపడతాయి. ఇంకొంతమందికి అర్ధరాత్రి దాటినా నిద్రపట్టదు. అందరూ నిద్రపోయే సమయంలో వీళ్లు నిశాచర జీవుల్లా మేలుకుని ఉంటారు. ఇదంతా జీవన విధానం వల్ల బయలాజికల్‌ క్లాక్‌లో వచ్చిన మార్పు ప్రభావమే! ఈ క్లాక్‌ను తిరిగి రివర్స్‌ చేసే వీలుంది. 

రోజు మొత్తంలో ఉదయం వేళే ఎక్కువ హుషారుగా, చలాకీగా ఉంటాం. కానీ కొంతమంది విషయంలో సీన్‌ రివర్స్‌ అవుతుంది. వీళ్లు ఉదయంవేళ బద్ధకంగా, నీరసంగా కనిపిస్తారు. చీకటి పడేకొద్దీ చలాకీతనం పెరిగిపోతుంది. అలా రాత్రి రెండయ్యేవరకూ నిశాచర జీవుల్లా సంచరిస్తూ తెల్లవారేవేళకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇదే రకమైన జీవన విధానాన్ని అనుసరించటంతో వీళ్ల బయలాజికల్‌ క్లాక్‌ ఆ టైమ్‌ టేబులకి తగ్గట్టు సెట్‌ అయిపోతుంది. ఇదే రకమైన లైఫ్‌ స్టయిల్‌ ఎక్కువకాలంపాటు కొనసాగితే ఆరోగ్య సమస్యలు దాడిచేస్తాయి. కాబట్టి త్వరగా నిద్రపోయి త్వరగా మేలుకునే అలవాటు అలవరచుకోవాలి.

ఒక గంటను కుదించండి...!

ఉదయమే నిద్రలేవాలంటే సాయంత్రం త్వరగా పని ముగించి పడుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది కదా అని సాయంత్రం వేళ పనులు తలకెత్తుకుంటే ముగించేవేళకి అర్థరాత్రవుతుంది. పనిని తగ్గించుకోవాలంటే ఎప్పటిలా లేట్‌నైట్‌ పడుకునే వేళకి కాకుండా ఓ గంట ముందుకి రోజుని లెక్కించాలి. ఆ సమయాన్ని మించిపోయే అవకాశం ఉన్న పనులను కల్పించుకోకూడదు. అలాంటి పనులకు నో చెప్పటానికి సందేహించకూడదు.

హుషారైన ఉదయం కోసం ప్రొటీన్‌
రోజు మొత్తంలో తప్పక తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌. ఉదయం వేళ నిద్రమత్తు వదలించటానికి కప్పు కాఫీ ఒక్కటే సరిపోదు. రాత్రంతా నిద్రపోయి లేచేటప్పటికి శరీరంలోని సుగర్‌ లెవెల్స్‌ తక్కువ మోతాదుకు పడిపోయి ఉంటాయి కాబట్టి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. మాంసకృతులు, కూరగాయలు, పొట్టు తీయని గోధుమలతో చేసిన పదార్థాలు తినాలి. నిద్రమత్తు వదిలించటానికి కాల్షియం, ప్రొటీన్‌ సమృద్ధిగా దొరికే పాలు, సోయాపాలు తాగాలి.
మీకు మేరే రివార్డ్‌ ఇచ్చుకోండి
పెందలాగే నిద్ర మెలకువైతే బయలాజికల్‌ క్లాక్‌ సర్దుకున్నట్టే! త్వరగా నిద్రలేవగలిగినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకుని అదనంగా అందిన సమయాన్ని ఆనందాన్నిచ్చే మీకిష్టమైన పనులు చేయటానికి ఉపయోగించండి. ఆ పనులే మీకు మీరిచ్చుకునే రివార్డు. దినపత్రికలోని ఇష్టమైన కాలమ్‌ చదవటానికి, మార్నింగ్‌ న్యూస్‌ తెలుసుకోవటానికి, వ్యాయామానికి లేదా మెడిటేషన్‌కు ఆ అదనపు సమయాన్ని వినియోగించండి. గుడ్‌ స్టార్ట్‌ను అందించటానికి ఆ పనులెంత ఉపయోగపడ్డాయో అర్థం చేసుకుంటే ఉదయాన్నే నిద్ర లేవటంవల్ల పొందే ప్రయోజనాలు ఎంత విలువైనవో గ్రహించగులుగుతారు.
ఉదయం వేళ వ్యాయామమే మేలు
అల్పాహారం తిన్న తర్వాత చేసే వ్యాయామంలో కంటే సూర్యోదయానికి ముందు చేసే వ్యాయామం వల్ల ఎక్కువ కెలోరీలు ఖర్చవుతాయి. ఉదయం వేళ వ్యాయామం చేయటం వల్ల బాడీ టెంపరేచర్‌, ఎడ్రినలిన్‌ లెవెల్స్‌ పెరిగి వ్యాయామ ప్రభావం రోజులో ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి బాగా అలర్ట్‌గా ఉండే ఉదయం వేళల్లోనే వ్యాయామం చేయాలి.
పడుకునేముందే హెయిర్‌ ట్రీట్‌మెంట్‌
ఉదయం వేళ హడావిడి లేకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముందే తలస్నానం చేయాలి. తలస్నానం చేసి వదులుగా జడ అల్లుకుని పడుకోవాలి. నిద్రలేచాక క్విక్‌ బ్లో డ్రై చేస్తే వెంట్రుకలు ఒత్తుగా తయారవుతాయి. లీవ్‌ ఇన్‌ కండిషనర్‌ అప్లైచేసి నీళ్లతో తడి చేసిన దువ్వెనతో దువ్వుకుంటే వెంట్రుకలు అదుపులో ఉండి చక్కగా సెట్‌ అవుతాయి.

జడల అల్లిక అవసరమే!

జడ కట్టు చూసి ఎప్పుడు నిద్ర లేచారో కనిపెట్టవచ్చు. కానీ అదే తలకట్టును కుదురుగా దువ్వుకుని జడతో కనిపిస్తే లేజీ పర్సన్‌కి బదులుగా మార్నింగ్‌ పర్సన్‌ అనే గుర్తింపు పొందే వీలుంది. అయినా జడలు ఫ్యాషన్‌లో భాగాలే! త్వరగా, తేలికగా దువ్వేసి అల్లుకునేవీలున్న జడలతో ఆఫీసులకు వెళ్లడంలో తప్పేముంది? అందుకే ఒకసారి వదులుగా జడ అల్లుకోవాలి. ఫ్రెంచ్‌ బ్రైడ్‌ వేసుకోవచ్చు. మరీ పొట్టి జుట్టు ఉన్నవాళ్లు క్లాత్‌ హెడ్‌బ్యాండ్‌ వేసుకోవచ్చు.

మేకప్‌ రొటీన్‌

లిక్విడ్‌ టు పౌడర్‌ ఫౌండేషన్‌ వాడటం వల్ల మేకప్‌ సెట్‌ చేసుకోవటానికి పౌడర్‌ ఉపయోగించాల్సిన పనుండదు. వేళ్లతో త్వరగా అప్లై చేయటానికి క్రీమ్‌ బ్లషెస్‌, ఐ షాడోస్‌ ఉపయోగించాలి. న్యాచురల్‌ లుక్‌ కోసం పై కనురెప్పకే మస్కారా, ఐలైనర్‌ అప్లై చేయాలి.

మంద్రమైన శబ్దం

సాయంత్రం వేళ టివీ, రేడియో, మ్యూజిక్‌ సిస్టమ్‌ల వాల్యూమ్‌లను తగ్గించాలి. నిద్ర మూడులోకి నెట్టే మంద్రమైన సంగీతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి శబ్దాల వల్ల మానసికంగా నిద్రకు సన్నద్ధమవుతాం.

Tuesday, 25 March 2014

HEALTHY ADVANTAGES OF EATING CURD DAILY - NUTRITIOUS BENEFITS WITH CURD - TELUGU ARTICLE ON CURD



* 4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.
* ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు .

* కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి ,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి .
* పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .

* పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సియం శాతం ఎక్కువ . కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.

* విటమిన్ బి , పాస్ఫరస్ , పొటాసియం , మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి .

* పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది .

* పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర , కరివేపాకు , చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి , డయేరియా తగ్గును .

* పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది .

* పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం.

* పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.

* రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు..శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి.

* అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.

TELUGU ARTICLE ON PUDINA LEAVES - THE HEALTHY BENEFITS OF USAGE OF PUDINA IN DAILY LIFE


అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు

1.పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. 

2.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. 

3.అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది

4.స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం బహుబాగా పనిచేస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

5.గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

6.గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

7.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మౄఎదువుగా మారుతుంది.

8.గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9.పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వౄఎద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

Friday, 28 February 2014

HEALTHY USES WITH IODIZED SALT - USE ALWAYS IODIZED SALT



మీ ఉప్పులో ఐరన్ ఉందా?

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయప పడాలంటే ఆహార నియమాలు పాటించడమే ప్రథమ చికిత్స. నిజమైన చికిత్స కూడా' అంటున్నారు వైద్య నిపుణులు.

రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ పదార్థం తయారుకావడానికి పోషక పదార్థాలైన మాంసకృత్తులు, ఇనుము ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ లెక్కన మగవారిలో ప్రతి 100గ్రాముల రక్తంలో 13 గ్రా., ఆడవారిలో 12 గ్రా., 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11గ్రా., గర్భిణీ స్త్రీలలో 11 గ్రా., బాలింతల్లో 12గ్రా., 7-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రా. హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ ఈ మోతాదు విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో వారు బాధపడుతున్నారని అర్థం. రక్తహీనతకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య తగ్గిపోతుంది. ఆర్‌బీసీ(రెడ్ బ్లడ్ సెల్స్)లోని హిమోగ్లోబిన్, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. అంటే ఆక్సిజన్ రవాణా వ్యవస్థగా ఎర్ర రక్తకణాలు పనిచేస్తాయి.

ప్రధానమైన బలహీనత
మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనతలు రక్తం హీనత. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. రక్తం నష్టపోవడం, రక్తం ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడం, పౌష్టికాహారలోపం. అయితే, సాధారణ పనులకే ఆయాసం రావడం, బలహీనం, నిరాశక్తత, ఆలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 ఏళ్ల వయసుగల మహిళల్లో, పదకొండు సంవత్సరాలలోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. రుతుచక్రం సమయంలో అధిక రక్త స్రావం కావడం వల్ల, పైల్స్ సమస్య వల్ల కూడా ఎనీమియా సంభవించవచ్చు. కొద్ది మంది మగవాళ్లలో కూడా రక్తహీనత సంభవిస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువతో బిడ్బ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, వెంటనే వెంటనే రోగాలు రావటం, చదువులో వెనకపడటం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

రక్తహీనత ఉన్నవారు ప్రధానంగా ఆహార నియమాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలు. ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం తప్పనిసరిగా చేయాలి. రక్తహీనత ప్రమాదకరమైనది కాబట్టే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక పెట్టి ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా అందజేస్తోంది.

ఇనుము కలిసిన ఉప్పుతో...

నిజానికి దేశంలో అధిక శాతం జనాబా రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు ఏర్పడిన కొత్త మార్గం ఇనుము కలిపిన ఉప్పును వినియోగించటం. దీన్ని జాతీయ పోషకహార సంస్థవారు కనుగొన్నారు. సాధారణ ఉప్పుకు బదులు కొత్తగా తయారు చేసిన ఈ ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడటం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. ప్రస్తుతం ఇనుము కలిపిన ఉప్పు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే దొరుకుతోంది.

విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండు, యాపిల్, ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం మానేయాలి. ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తహీనతను అశ్రద్ధ చేయవద్దు. అది కేవలం నీరసానికి మాత్రమే దారి తీయదు. ప్రాణహాని కూడా కలుగవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటిస్తూనే వైద్యులను సంప్రదించడం సరైన పని.

Saturday, 22 February 2014

SALT - USES TO HUMANS - ADVANTAGES AND DISADVANTAGES OF USING SALT - BRIEF ARTICLE ON SALT


'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పువాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది మంచినీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగద్విదితమే. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. 

సాధారణంగా మన శరీరానికి ఉప్పు రోజుకు సుమారుగా 4 గ్రాములు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొలతలతో తీసుకోరు కనుక ఉప్పును చాలామంది అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉప్పును ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా వాడే వారికి అధిక రక్తపోటు వస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. అలాగే అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తపోటు వచ్చిన వారు పలు విధాల మందులను ఎక్కువగా వాడకుండా సాధ్యమైనంత తక్కువగా ఉప్పును వాడటం ద్వారా రక్తపోటు చాలామటుకు అదుపులో ఉంచుకోవచ్చునని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

రక్తపోటు తగ్గేందుకు వాడే మందులవల్ల కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడంతో పాటు గుండె జబ్బులు వంటి అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరించడమేకాదు, రక్తపోటును తగ్గించుకోవడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమనికూడా చెబుతున్నారు.

చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువగా తినడం, ఊరగాయలు ఎక్కువగా తినడం వల్ల వారిలో ఉదర సంబంధమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేసే కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్‌ను తినిపిస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఫాస్ట్‌ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

నేడు ఎంతోమంది జరిపిన పరిశోధనల్లో ఉప్పుకోసం ప్రత్యేకంగా ఉప్పును వాడనవసరం లేదని మనం రోజూవారీ తీసుకునే ఎక్కువగా వండని కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన ఉప్పు లభిస్తుందని పరిశోధనల్లో ద్వారా తేలింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఉప్పును అసలు తీసుకోకుండా ఉన్నట్లయితే నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఏర్పడతాయంటున్నారు. అందుకే ఉప్పును ఎంతవరకో అంతే తీసుకోవడం ఉత్తమం.

ఉప్పువల్ల కొన్ని లాభాలుకూడా ఉన్నాయి. ఉప్పును నీళ్ళల్లో కలిపి ఇంటిని శుభ్రంగా కడిగినట్లయితే ఈగలు కొన్ని గంటల వరకు నేలపై వాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీపం బుడ్డిలో పోసే కిరోసిన్‌లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం కాంతి ఎక్కువ కావడమేకాకుండా, కిరోసిన్‌ కూడా ఆదా అవుతుంది. ఈ విషయం తాతయ్య, నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది తెలిసే ఉంటుంది. నేటికి కూడా కిరోసిన్‌ దీపాలు వాడే చాలా ఇళ్ళల్లో ఇలా చేస్తుంటారు కూడా. వస్త్రాలమీద సిరా మరకలు ఉన్నట్లయితే ఉప్పుతో బాగా రుద్ది, వేడినీళ్ళతో కడిగినట్లయితే పోతాయి. 

నిల్వ ఉండే బియ్యంలో ఉప్పును చల్లినట్లయితే పురుగులు బియ్యానికి పట్టే అవకాశం లేదు. దానిలో ఉన్న పురుగులు కూడా పోతాయి. ఇలా ఉప్పు వల్ల చాలా లాభాలున్నాయి. అయితే శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక శరీరానికి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పునే వాడటం ద్వారా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

HEALTH BENEFITS WITH NATURAL GINGER


అల్లం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. 
ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇదొకటి. 
దీంతో అద్బుతమైన వైద్యం 
చేయవచ్చని  వైద్యులు చెపుతారు. 
భారతీయ వైద్యులు నిరూపించారు కూడా. 
ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం అన వాయితీ, 
పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను 
అల్లం రసం కానీ, చిటికెడు శొంఠి పొడి కానీ ఇస్తే 
తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
అలాగే, పెద్ద వాళ్లు మోతాదు కు సరిపడా తీసుకోవచ్చు. 

Thursday, 30 January 2014

HEALTHY BONE CARE TIPS WITH VITAMIN-D



ఎముకల బలం కోసం....!

ఎముకలు బలిష్టంగా లేకపోతే వృద్ధాప్యంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ముప్పయి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బలవర్దకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎముకల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటున్నారు వైద్యులు.

- కండరాల పటుత్వానికి, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, హార్మోన్ల పనితీరుకు కాల్షియం అవసరం. శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్లలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఛీజ్, మజ్జిగ, పెరుగు, ఆల్మండ్స్, బీన్స్‌లు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

- శరీరానికి తగినంత కాల్షియం అందించడంలో విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. పొద్దున లేస్తూనే బిజీ జీవితంలో పడిపోయే నగరజీవి శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోవడం కష్టం. అందుకని విటమిన్ డి కొరత ఉంటే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడటం ఉపయుక్తం. విటమిన్ కె, పొటాషియం కూడా ఎముకల్ని బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

- పౌష్టికాహారం ఒక్కటే ఎముకల్ని బలిష్టంగా తయారుచేయదు. శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం తప్పక అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటేనే కాల్షియం కొరత ఏర్పడదు. దీని కోసం ఉదయాన్నే నడవడం, పరిగెత్తడం, వ్యాయామం చేయాలి.

- ఎముకల సామర్థ్యాన్ని దెబ్బతీసేవాటిలో మద్యపానం, ధూమపానం ప్రమాదకరమైనవి. మోతాదుకు మించి తీసుకుంటే వయసు మీద పడేలోపు ఎముకల్ని పీల్చిపిప్పి చేస్తుంది మద్యం. అందుకని మితంగా తీసుకుని, చక్కటి ఆహారాన్ని భుజిస్తే సమస్యను అధిగమించవచ్చు.

Wednesday, 29 January 2014

NO SLEEP - DANGER TO HEALTH - SO GO TO BED WITHIN TIME



ఒకటి రెండు రోజులు సరిగ్గా నిద్రలేకపోయినా, నిద్రలేమి ఏర్పడినా శరీరంలో చురుకుతనం, ఉత్సాహం తగ్గిపోతుంది. ఆవలింతలు వస్తూంటాయి. సోమరితనం ఏర్పడుతుంది. ఒకటి, రెండు రోజులు నిద్రా సమయం తగ్గితే ఆ తర్వాత ఎక్కువ సమయం నిద్రలో గడిపి, ఆ బద్ధకాన్ని తీర్చుకుంటారు చాలామంది. అయితే ఎక్కువ రోజులు నిద్రపట్టకుండా ఉండటం, అపరాత్రివేళ మెలకువవచ్చి తిరిగి నిద్రపట్టక పోవడమన్నది ఆరోగ్యరీత్యా మంచి విషయం కాదు. నిద్రలేమి వ్యాధి కానప్పటికీ దానివల్ల ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్రెషన్‌, జ్ఞాపకశక్తి మందగించడం, మెదడు సరిగ్గా ఆలోచించలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంలాంటి లక్షణాలు ఏర్పడతాయి.
రక్తపోటు కూడా పెరిగే ప్రమాదముంది. శరీరానికి, మనస్సుకూ తగినంత విశ్రాంతి లభించనందువల్ల, మానసిక శారీరారోగ్యాలు కుంటుపడుతాయి. ఎక్కువకాలం నిద్రలేమి ఏర్పడటం వల్ల హార్ట్‌ అటాక్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎటువంటి శారీరక అనారోగ్యాలు లేకుండా నిద్రపట్టకుండా ఎక్కువరోజులు బాధపడుతున్నవారు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సూచనలు, సలహాలు పాటిస్తూ నిద్రలేమిని తొలగించుకోవాలి. ఏ కారణాలవల్ల నిద్రలేమికి గురవుతున్నారో, నిద్రాభంగమవుతోందో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం వెతికి హాయిగా నిద్రపోయే ప్రయత్నాలు చేయాలి. లేకపోతే నిద్రలేమి దీర్ఘకాల వ్యాధులకు గురిచేస్తుంది.

Tuesday, 14 January 2014

HEALTHY ADVANTAGES OF EATING REGI PANDU - REGI FRUIT


రేగుపండులో సుగుణాలు

రేగు పండులో విటమిన్ డి, ఎ, కె పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేగు పండు మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల రకాల రేగు పండ్లు లభిస్తున్నాయి. ఎండిన రేగు పండులో కాపర్, బోరాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాలు ఆస్టియోపొరోసిస్ నివారణలో ప్రధానపాత్ర వహిస్తాయి. రేగు పండు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మినరల్స్ బీపిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది. మంచి యాంటిఆక్సిడెంట్ కూడా కావడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రేగు పండులో బీ కాంప్లెక్స్‌లోని నియాసిన్, విటమిన్ బి6, ఫినోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కార్బోహైవూడేట్లు, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాల జీర్ణక్షికియకు తోడ్పడుతాయి. 

గుండె ఆరోగ్యానికి - రేగు పండులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా నిరోధిస్తుంది. అందువల్ల బీపి అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె కొట్టుకునే విధానం కూడా స్థిరంగా ఉంటుంది. రేగు పండులోని సాలిబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండులోని అధిక పొటాషియం శరీర బరువును కూడా నియంవూతిస్తుంది.

కాన్సర్ ను నిరోధిస్తుంది - రేగు పండులోని బీటా కెరోటిన్ చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటి ఆరోగ్యానికి - ఆరోగ్యవంతమైన కళ్లకి విటమిన్ ఎ ఎంతో అవసరం. రేగుపండులో విటమిన్ ఎ తో పాటు జియాక్సిథిన్ అనే ఒక ఫైబర్ కూడా రెటినా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మలబద్దకానికి - ఎండిన రేగు పండును ప్రూనే అంటారు. జీర్ణక్షికియకు తోడ్పడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఉండే సార్బిటాల్, ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణక్షికియ సామర్థ్యం పెరిగి కడుపులో కదలికలు సరైనరీతిలో జరిగి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం రేగు పండు.

నిరోధక శక్తి పెంపొందించడానికి- రేగుపండు ద్వారా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

వృద్ధాప్యం వాయిదా -రేగు పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాలిక్ యాంటిఆక్సిడెంట్, లూటిన్, క్రిప్టోక్సాథిన్, జియాక్సిథిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ప్రతినిత్యం జరిగే ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి వీలుంటుంది.

Wednesday, 18 December 2013

WHAT IS ANTIBIOTICS - HOW DOES IT HELPS TO US



యాంటీబయాటిక్స్‌ అనేవి రసాయనాలు. ఈ రసాయనాలను శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ఒక విధమైన ''జర్మ్స్‌'' ను చంపటంకానీ, పెరగకుండా కానీ చేస్తాయి. మైక్రోబ్స్‌ నుండి ఆంటీబయాటిిక్‌లను తయారు చేస్తారు. బాక్టీరియా, మోల్డ్‌లు. ఆంటీబయాటిక్‌లు. యాంటీబయాటిక్‌ల తయారీలో మెక్రోబ్స్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వాటి వల్ల రసాయనాలు వ్యాధి మైక్రోబ్స్‌ మీద యుద్ధం ప్రకటించడానికి, మైక్రోబ్స్‌ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేందుకు నిరంతరంగా పోరాడుతూనే వుంటాయి. ఈ పోరాటంలో సంక్లిష్టమైన రసాయనాలను తమ శరీరంలో ఉత్పత్తి చేస్తాయి.
ఈ రసాయనాలను శాస్త్రవేత్తలు పరీక్షించి ఎన్నో వేరే రసాయనాలను కనుగొన్నారు. వీటివల్ల జబ్బును కలిగించే జర్మ్స్‌ను చంపవచ్చు. ఈ రసాయనాలను ప్రయోగశాలలో తయారుచేస్తే వాటివల్ల యాంటీబయాటిక్‌లు తయారు చేయవచ్చు. ఈ యాంటీబయాటిక్స్‌ ఏవిధంగా తయారు చేయవచ్చు. (పెన్సిలిన్‌ టెర్రామైసిన్‌, టెట్రాసైక్లిన్‌) ఈ యాంటీబయాటిక్‌లు జర్మ్స్‌ ఆక్సిజన్‌ అందకుండా చేస్తాయని, దీని వల్ల జర్మ్స్‌ విడిపోయేందుకు అవకాశం లేకుండా చేస్తూ, మనిషి శరీరంలో నుండి అవి ఆహారం తీసుకోకుండా కూడా ఈ యాంటీబయాటిక్స్‌లు పనిచేస్తాయన్నారు. ఆకలితో అవి చనిపోవడం కూడా జరగుతుందంటున్నారు. ఈ జర్మ్స్‌ యాంటీబయాటిక్‌లను తిని విషపూరిత మౌతాయంటున్నారు. ఒక్కోరకం యాంటీబయాటిిక్‌లు ఒక్కోవిధంగా జర్మ్స్‌ పైన దాడి చేస్తాయి. కొన్ని రకాలేమో జర్మ్స్‌ను చంపేస్తాయి. కొన్నేమో బలహీనపరుస్తాయి. ఈ విధంగా యాంటీబయాటిక్‌లు మనకు ఉపయోగపడుతున్నాయి. గ్రీకు పదాల అర్థమైన 'Aస్త్రaఱఅర్‌ ూఱటవ' అనే దాని నుండి యాంటీబయాటిక్‌లనే పదమొచ్చింది.

Wednesday, 11 December 2013

ARTILCE ON HUMAN PART - NOSE AND ITS PROBLEMS - BRIEF DISCUSSION





''శరీర మాద్యం ఖలుధర్మ సాధనమ్‌''
''లోకమందు ఏ కార్యసాధనమునకైనను ముందుగా కావలసింది ఆరోగ్యం'' అన్నాడు మహాకవి కాళిదాసు తన కుమార సంభవంలో.
''ఆరోగ్యమే మహాభాగ్యం''అన్నది నానుడి. మంచి ఆరోగ్యం ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్లే అంటారు కూడా! అంటే-మంచి ఆరోగ్యవంతుడైన మనిషి మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను తన సొంతం చేసుకుంటాడు.
సామాన్య ఆరోగ్యవంతుడు కూడా తన జీవిత కాలంలో కనీసం మూడుసంవత్సరాల పాటు వ్యాధులతో బాధపడతాడని చెప్పవచ్చు. మనిషికి ప్రాణవాయువును అందిస్తూ మనిషిలోని మిగిలిన అన్ని అవయవాలకు, జవాన్నీ జీవాన్నీ అందించే అత్యద్భుత అవయవాల్లో అతిముఖ్యమైనవి ముక్కు నోరే! ఎందు కంటే-ఒక మనిషి మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా లేక అనారోగ్యాల బారిన పడాలన్నా ముక్కు'నోరే ప్రధాన భూమిక పోషిస్తాయి! అందుకే-మనిషికి వచ్చే జబ్బుల్లో కనీసం, 70%పైగా జబ్బులు ముక్కు' నోరు విషయంలో అలసత్వం, అశ్రద్ధ, అజాగ్రత్తల కారణంగానే వస్తుంటాయని వైద్యశాస్త్రం గుర్తించింది. మనం పీల్చేగాలి, మనం తీసుకునే ఆహారమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. వీటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా తద్వారా మిగిలిన అవయవాలకు జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందని అనుక్షణం గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం.
మనిషికి వచ్చేజబ్బులు సాధారణంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. ఇవి పుట్టుకతో వచ్చే జబ్బులు. వయసుతోబాటు వచ్చే జబ్బులు. అజాగ్రత్తలు లేదా ఇన్ఫెక్షన్స్‌ ప్రమాదాల కారణంగా వచ్చే జబ్బులు.
ఇక్కడే మనం ఓ ముఖ్య విషయం ప్రస్తావించు కోవాలి. ప్రతిమనిషికీ తనలోనే వ్యాధి నిరోధక శక్తి నిబిడీ కృతమై
ఉంటుంది.
మంచి ఆరోగ్యం ఉన్న మనిషికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువ వ్యాధులు వస్తాయని మనం గుర్తించాలి. ముఖ్యంగా-ముక్కు -గొంతు ఇబ్బందులుఉన్నవారిలో వైరస్‌, బాక్టీరియా క్రిములు త్వరితగతిన చొచ్చుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి! మనిషికి ప్రాణవాయువును అందిస్తూ అతను జీవించడానికి కారణమైన ప్రధాన అవయవమైన ముక్కుకు సంబంధించిన వ్యాధులు పలురకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే-
1. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
2. మెదడునుంచి కణితులు ముక్కుద్వారా బయటపడటం
3. ముక్కు చీలిక
4. ముక్కులో ఈగలార్వా అభివృద్ధి చెందటం
5. ముక్కులో వెంట్రుకలు-జిగురులాంటి పదార్థం తయారుకావడం
6.ముక్కునుంచి రక్తం కారడం
7. ముక్కులో కండరాలు పెరగడం
8. ముక్కులో కణితులు పెరగటం
9.సైనొసైటిస్‌
10. ముక్కు అలర్జీ మరియు వేసోమోటార్‌ రైనైటిస్‌.
11. ముక్కులో గడ్డలు
12. ముక్కుపైన గడ్డలు
13. ముక్కు క్యాన్సర్‌
14. నేనో ఫెరెంజియల్‌ ఏంజియో ఫైరోమా
15.చిన్న పిల్లల్లో ముక్కు వెనుక భాగాన లింఫ్‌ గ్రంథులు వాచడం వల్ల వచ్చే అడినాయిడ్స్‌.
16. ముక్కునుండి దుర్వాసన.
17. ముక్కులో పుండు.
18. ఒక ముక్కునుంచే రసికారడం.
19. ముక్కు నుంచి రక్తం, చీము కారడం.
20. బలపం, బఠానీలు, రబ్బరు, పెన్సిల్‌, స్పాంజి వంటివి ముక్కులో ఇరుక్కోవడం
21. ముక్కులో పేపరు, పుల్లలు ఉండిపోవడం
22. ముక్కులో రాళ్ళు తయారుకావడం
23. వాసన తెలియక పోవడం, గ్రహణ శక్తి తగ్గిపోవడం
24. ముక్కుతో మాట్లాడటం
25. మూసుకు పోయిన ముక్కు, గాలి పీల్చే నోరు.
26. ముక్కు కారడం (ఇది మెదడులో నీరేనేమో?)
27. కంట్లోనీరు-ముక్కులో జబ్బు
28. సైనస్‌ తలనొప్పి

29. ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల వచ్చే తలనొప్పి.
ముక్కు గురక
30. గురుక నోటి గురక
శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల వచ్చే గురక.
31. ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌
1.సాధారణ జలుబు
2. ముక్కుపైన పుళ్ళు పడటం.
3. దీర్ఘకాలికంగా ఉండే ముక్కువ్యాధులు
4. పొక్కులు కట్టే ముక్కు వ్యాధి (అట్రోఫిక్‌ రైనైటిస్‌)
32. ముక్కు ఎముక విరుగుట
33. వంకర ముక్కు.
34. ముక్కులో రక్తం గడ్డ.
(రక్తం గడ్డ చీము గడ్డగా మారడం)

WHY DO WE NEED VITAMINS ?




ఇప్పుడు ఎక్కడ చూచినా 'విటమిన్ల' వాడకం ఎక్కువైపోయింది. అవి బిళ్ళలు, గొట్టాల రూపంలోనూ, త్రాగే మందుల రూపంలోనూ లభిస్తున్నాయి. మనం తినే ఆహార పదార్థాలలో చాలా తక్కువ మోతాదులో విటమిన్లు ఉంటాయి. ఇవి కర్బన పోషకపదార్థాలు శరీరంలో 'జీవక్రియ' జరుగుతుంది కదా! దానిలో ఇవి కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. 'వైటా' అంటే జీవితానికి సంబంధించినది. 'ఎమైన్‌' అనేది జీవరసాయనిక శాస్త్రపరమైనది. అంటే ప్రాణానికి హేతువైన ఒక ఎమైన్‌ అని అర్థం. విటమిన్ల లోపం వలన అనేక వ్యాధులు కలుగుతాయి.
ఇప్పటి వరకు 20 రకాల విటమిన్లు గుర్తించారు. ముఖ్యమైనవి 6 మాత్రమే! అని 'ఎమిసిడిఇకె' ఇందులో ఎడిఇకెలు క్రొవ్వులో కరుగుతాయి. బి.సి.లు నీటిలో కరుగుతాయి. విటమిన్‌ ఎ: ఇది లేకపోతే దృష్టి తగ్గుతుంది. అంటు వ్యాధులు, చర్మరోగాల నుండి రక్షిస్తుంది. విటమిన్‌ బి: దీనిలో చాలా రకాలున్నాయి.. అన్నిటినీ కలిపి 'బి కాంప్లెక్స్‌ '' అంటారు. 'బి' లోపం బెరి బెరిని కలిగిస్తుంది.' బి2' 'చర్మరోగాలు, నాలుకపై పుండ్లు, పెదవులు పగులుతాయి. 'బి6' మెదడులో వత్తిడి' మెదడులో వత్తిడి పెరుగుతుంది. ఆకలి నశిస్తుంది. 'బి7' అజీర్ణవ్యాదులు వస్తాయి. 'బి12' శక్తి హీనత కలుగుతుంది. ఇది ఉంటే 'కేంద్రనాడీ మండలం' సరిగా పనిచేస్తుంది. విటమిన్‌ సి: స్కర్వీ అనే రోగం వస్తుంది. నోరు పుండు పడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. చర్మం క్రింద కేశనాళికలు చిట్లుతాయి. విటమిన్‌ డి: చిన్నపిల్లల్లో రెకెట్స్‌' కలిగిస్తుంది. పెద్దల్లో ఎముకలు పెళుసుబారేలా చేస్తుంది. విటమిన్‌ ఇ: రక్తం. మెదడు, కాలేయాలకు ప్రమాదం. విటమిన్‌ కె: రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. వీటిల్లో ' ఏ' విటమిన్‌ లోపం ఉన్నా వాటిని సరిదిద్దుకోవటం అవసరం. 

Monday, 9 December 2013

WHAT IS DIABETES DISEASE - WHAT IS SUGAR DISEASE - MAIN SYMPTOMS OF DIABETES - HOW TO CURE DIABETES - WHAT ARE THE STEPS TAKEN WHEN DIABETES DETECTED - DIABETES TIPS IN TELUGU



చక్కెర వ్యాధిపట్ల అనుమానాలు వద్దు మధుమేహంపై



ప్రశ్న: మన శరీరానికి చక్కెర ఎందుకు అవసరం?
జవాబు : మనం తీసుకున్న ఆహారాన్ని మన శరీరం గ్లూకోజ్‌ అనే శక్తిరూపంగా మారుస్తుంది. దీనికే బ్లడ్‌ షుగర్‌ అని పేరు. దీనినే మన శరీరం శక్తి కోసం ఉపయో గించుకుంటుంది.
ప్రశ్న : మన శరీరంలో అవసరమైనంత వరకు చక్కెర స్థాయి వుండేటట్లు చూసే వ్యవస్థ ఏది?
జవాబు : మన జీర్ణాశయానికి దగ్గరగా క్లోమగ్రంధి వుంది. ఇది ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్‌ ఆహారం ద్వారా వచ్చే చక్కెరను శరీర కణాలకు చేర వేస్తుంది. ఆ కణాలు చక్కెరను ఉపయో గించుకుని శక్తిని విడుదల చేస్తాయి.
ప్రశ్న : మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటే ఏమిటి?
జవాబు : మన శరీరంలో తయారయ్యే ఇన్సులిన్‌ బాగా పనిచెయ్యకపోయినా, లేక తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోయినా మన శరీరంలో చక్కెర ఎక్కువగా పేరుకు పోతుంది. ఇది మన శరీరానికి నష్టం కలిగి స్తుంది. ఈ స్థితినే 'మధుమేహం' అని అంటారు. దీనినే వైద్య రంగ పరిభాషలో 'డయాబెటిస్‌ మెల్లిటన్‌'గా వ్యవహరిస్తారు.
ప్రశ్న : సాధారణంగా ఒక వ్యక్తి రక్తంలో చక్కెరస్థాయి ఎంత పరిమాణంలో వుండాలి?
జవాబు: ఎడిఎ వారు 2000 సంవత్సరంలో 'మధుమేహం'కు సంబంధించి సూచించిన వివరాలు:1) ఆహారం తీసుకోకుండా ఉన్న ప్పుడు రక్తంలో వుండవలసిన చక్కెర : ద100 మి.గ్రా/డిఎల్‌
2) హెచ్‌.పి.జి (ఆహారం తీసుకున్న తరువాత) : ద140 మి.గ్రా/డిఎల్‌
న 75 గ్రాముల గ్లూకోజ్‌ పౌడర్‌ను నీటిలో కలిపి తాగిన రెండు గంటల తర్వాత ఈ పరీక్ష చేయవలసి వుంటుంది.
ప్రశ్న:మధుమేహం రావడానికి గల కారణాలేమిటి?
జవాబు : వంశపారంపర్య లక్షణాలు. రోగ నిరోధక వ్యవస్థ అస్థవ్యవస్థమై తనకు తానే కణాలను నాశనం చేయడం, క్లోమగ్రంధి చెడిపోవడం లేదా వ్యాధిసోకడం. మారు తున్న జీవన విధానం. పోషకాహార లోపం కారణంగా బరువు పెరగటం లేదా తగ్గడం. మానసిక ఒత్తిడి.
ప్రశ్న : మధుమేహ రోగలక్షణాలేమిటి?
జవాబు: a) చాలా తరచుగా 1) మూత్రం పోయాల్సిరావడం 2) దాహం వేయడం 3) ఆకలి వేయడం. b) బరువు తగ్గడం ష) బల హీనత/ అలసట స) చర్మము మరియు జన నేంద్రియాలపై దురద వ) గాయాలు, పుండ్లు మానడానికి చాలా కాలం పట్టడం ట) అస్పష్ట మైన కంటిచూపు.
పైన పేర్కొన్నట్లుగా 'ఎ'లోనివి మొదటి రకం మధుమేహ లక్షణాలు. 'బి' నుండి 'ఎఫ్‌' వరకు చెప్పినవి రెండవ రకం మధుమేహ లక్షణాలు. ఇవి పైకి స్పష్టంగా కనబడక పోవచ్చు. కాబట్టి - రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలను తరచుగా చేయించుకోవాలి.
ప్రశ్న: మధుమేహాన్ని ఎందుకు అదుపు చెయ్యాలి?
జవాబు: రక్తంలో అధిక చక్కెర శాతం అనేక సంవత్సరాలుగా వుంటే - నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటాయి.
ఈ వ్యవస్థలు దెబ్బతింటే వచ్చే సమస్యలు:
ఎ) గుండె మరియు రక్త ప్రసరణలో సమ స్యలు ఏర్పడటం.
బి) మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం.
సి) పాదాలు స్పర్శజ్ఞానం కోల్పోవడం.
డి) కంటి చూపు మందగించడం.
ప్రశ్న : మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందా?
జవాబు: తగ్గదు, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి.దీనిని అదుపుచెయ్యడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని కాపాడుకోవచ్చు. మధుమేహాన్ని నివారించలేం. నియంత్రించగలం అంతే!
ప్రశ్న : మరి అటువంటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఏం చెయ్యాలి?
జవాబు : మీరు ముందుగా మధుమేహం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి. మధుమేహంతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఎన్నుకున్న జీవితాన్ని హాయిగా ఆనందించవచ్చు.
ప్రశ్న : మధుమేహానికి చికిత్స ఏమిటి?
జవాబు : మొదటి రకం మధుమేహానికి - ఇన్సులిన్‌ అవసరం. చక్కని పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం అవసరం. దీని వల్ల రక్తంలో సాధారణ చక్కెర స్థాయి వుండేటట్లుగా చూసు కోవచ్చు. తద్వారా దీర్ఘకాలిక సమస్యలను అదుపు చెయ్యవచ్చు.
రెండవ రకం మధుమేహానికి చక్కని పోష కాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో బాటు, డాక్టరు సలహా ప్రకారం మందులు, అవసరం మేరకు ఇన్సులిన్‌ వాడవలసి వుంటుంది.
ప్రశ్న : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పదా ర్థాలు తినాలి? ఏఏ పదార్థాలు తినకూడదు?
జవాబు : మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల పదార్థాలు తీసుకోవచ్చు. ఆరోగ్యా న్నిచ్చే సమతులాహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అందువల్ల - మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో అన్ని రకాల పదార్థాలు వుండేలా చూసుకోవాలి. చక్కెర మరియు ఇతర తీసి పదార్థాలు మాత్రమే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయని భావించరాదు. పిండి పదార్థాలను కలిగివుండే పండ్లు, కూర గాయలు, చిక్కుళ్ళు, పాలు, ధాన్యాలు కూడా చక్కెరస్థాయిని అధికంచేస్తాయి. ఈ పదార్థాలను ఒకేసారి కాకుండా,రోజుమొత్తానికి సమంగా విభ జించుకుని, తగిన పరిమాణంలో తీసుకోవాలి.