WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Lord Sri Rama / Ramayanam Stories and Articles. Show all posts
Showing posts with label Lord Sri Rama / Ramayanam Stories and Articles. Show all posts

Saturday, 10 September 2016

INFORMATION ABOUT SRI RAMADASU KEERTHANALU


శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!

'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి
.
(- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే...
- సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే...
- కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద...
- రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే..
- అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...)
శ్రీరాములతో ఆహా ! పుట్టనైతిని రఘు రాములతో
అయ్యో ! పుట్టనైతిని శ్రీరాములతో పుట్టి సేవలు జేయనైతిని // పల్లవి //
దశరథ నందనుడై దాశరథి రాములు
వశముగ బాలురతో వరదుడై యాడంగ
వనజ నాభునకు నే భక్తుడనై
భయ భక్తి ప్రేమలతోడ శ్రీరామ రామ // ఆశ //
సకల సేవలు సలుపుచు మురియుచు
అకట ! నల్గురతో నాడు కొందును గద
అయోధ్యా నగరిలో గజమునెక్కి
అచ్యుతుడు వెడలి రాగాను // ఆశ //
నాట్యమాడుచు నను రక్షింపు మందును ;
విశ్వామిత్రుని వెంట పోగానే పోదును
జనకుడు హరికి జానకిని పెండ్లి సేయగా
వారిద్దరికి నెత్తి బియ్యము నేదెత్తును // ఆశ //
అమ్మకు హరికి నాకులు మడిచిత్తును ; , నరులార !
ఇతడే నారాయణుడని జాటుదును
; , మనలను రక్షించే, మాధవుడు వచ్చెనందును
; , మన గతి ముందు ఏమందును // ఆశ //
బలిముఖులకు గల బలము జూతుగద
శుభరాములతో సొంపు కందుగద
లక్ష్మణాగ్రజుడు సేనను రావించి
లక్ష్మి కొరకు కపులు లంక జుట్టగ
రక్షించు భద్రాద్రి రామదాసుడని
రణములో రావణుని ద్రుంతును
ఆ క్షణమున రఘువరుని అప్పుడే బిలుతును
మంగళ పతివ్రతను మాధవుకర్పించి మురియుదు // ఆశ //

Friday, 5 February 2016

SUNDARAKANDA - HANUMAN FOUND SITA AT RAVAN LANKA


సుందరకాండ.!
హనుమంతుడు సీతమ్మని దర్శించడం.
.
హనుమంతుడు కూర్చున్న అశోక వృక్షానికి దగ్గర్లోనే ఒక చైత్య గృహం ఉన్నది. అది అసంఖ్యాక స్తంభాలపై నిర్మితమై ఉన్నది. మహా విశాలంగా ఉంది. ఆ చైత్యప్రాసాద ప్రాంగణంలో ఆయనకప్పుడు ఒక స్త్రీ కనిపించింది. ఆమె చుట్టూ రాక్షసాంగనలు ఉన్నారు. ఎంతో కాంతిమంతురాలైన ఆమె ఎంతో కృశించినట్లు కనబడుతున్నది. ఆమె ధరించిన పచ్చటి పట్టుచీర బాగా నలిగిపోయి, మాసిపోయి కనిపిస్తున్నది. ఆమె దట్టంగా వ్యాపించిన అగ్ని జ్వాల వలె ఉంది. అంగారక గ్రహం వేధిస్తున్న రోహిణీ నక్షత్రంలా ఉంది. మంఅదలోనుంచి తప్పిపోయి వేట కుక్కల మధ్య ఉన్న హరిణంలా కంపించిపోతూ ఉంది.
ఎప్పుడూ ఈమె దు:ఖం ఎరిగి ఉండదు. ఇప్పుడు పరమ దు:ఖసంతప్తురాలై కనిపిస్తున్నది. ఆనాడు ఋశ్యమూక పర్వతం మీద తాము ఉండగా రావణాసురుడు దుర్మార్గంగా ఎత్తుకుని పోతున్నప్పుడు తాము చూసిన స్త్రీ ఈమే అయి ఉండచ్చని హనుమంతుడికి తోచింది.
ఆమె స్పష్టంగా అర్థం కాని స్మృతి సూక్తంలా, ఒట్టిపోయిన సంపదలా, సన్నగిల్లిన శ్రద్దలాగ, క్షోభించిన బుద్దిలాగ, గొప్ప కీర్తికి సంప్రాప్తించిన అపవాదులాగ ఉన్నది. రాముడు దగ్గర లేక, రావణుడి భయం వల్ల బెదురు చూపులు చూస్తున్న లేడిలాగ కనబడుచున్నది. కనుకొలకులనుంచి సతతం అశ్రువులు కారిపోతున్నాయి ఆమెకు. మబ్బులు కమ్ముకుని ఉన్న చంద్రబింబంలా ఉంది. రాముడు చెప్పిన గుర్తుల వల్ల ’ఈమె నిశ్చయంగా సీతాదేవే అయి ఉండాలి’ అనుకున్నాడు హనుమంతుడు.
సీత ధరించినట్లుగా రాముడు చెప్పిన ఆభరణాలనీ అక్కడ కొమ్మలకి వేలాడుతుండగా చూసాఉ. ఆమె పూర్వం నగలతో జారవిడిచిన వస్త్రం, ఇప్పుడు సీతమ్మ ధరించిన వస్త్రం ఒకే రంగులో ఉండటం హనుమంతుడు గమనించాడు. సీతారాముల పరస్పర సౌందర్యాన్ని పోల్చి చూసుకుని ఆనందించాడు. మళ్ళీ ఇలా బాధపడ్డాడు.
మాన్యా గురువినీతస్య లక్శ్మణస్య గురుప్రియా,
యది సీతాపి ద్:ఖార్తా కాలో హి దురతిక్రమ: (సుందరకాండ 16.3)
లక్ష్మణుడికి ఈమె అత్యంత పూజనీయురాలు, శ్రీ రాముడికి ప్రాణాధిక, అయ్యో! ఈమె ఇప్పుడిట్లా దు:ఖం పాలైంది. ఇంతకూ కాలాన్ని ఎవ్వరు అతిక్రమించగలరు?
ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన:,
ఇయం సా దయితా భార్యా రాక్షసీవ్శమాగతా. (సుందరకాండ 16.17)
ఈమె దశరథ మహారాజు పెద్ద కోడలు, ధర్మమూర్తి, కృతజ్ఞ్నతా స్వరూపుడు, ఆత్మవిధుడు అయిన శ్రీరాముని ఈమె చెట్టపట్టింది. ఆయనకెంతో ఇష్టురాలు. ఇప్పుడిట్లా రాక్షసులకు వశమయింది.

SIGNIFICANCE OF SRI RAMA MANTRAM IN TELUGU AND ENGLISH - THANKS TO SRI SRAJU NANDA GARU FOR HIS EXCELLENT ARTICLE


శ్రీ రామ రామ రామేతి మంత్రం (Sri Rama Rama Rameti Mantra)

Rama Mantra - Sree Raama Raama Rameti


Easy Method for Chanting


No doubt every Hindu knows the importance of Vishnu Sahasranama Stotra. But the question is how many of us are able to chant the Vishnu Sahasranama every day ? Of course, we know the significance and relevance. But we are too busy that we do not get half an hour free to sit down and chant this mantra.

Have you ever thought of a short cut. Here I am offering an easy version of Vishnu Sahasranama Stotra which contains thousand names of Lord Vishnu.
Significance of Rama Mantra - Sri Rama Rama Rameti
Of course, I cannot claim any invention. It is there in Vishnu Sahasranam itself. Goddess Parvathi asks the Lord, which is the easiest way to recite this prayer. God tells that for the learned (pundits) it is enough to repeat the name of Rama. It is also called the Rama Mantra. Rama Mantra - Sri Rama Rama Rameti sloka which when recited gives the same effect as reciting the whole of Vishnu Sahasranama Stotra.
Parvathuvacha,
kenopayena laghunaa visnornama saharakam
padyathe panditair nityam srothumichamyaham prabho
Parvathy asked " how will the scholars recite this sloka of thousand names daily".
Iswara uvacha,
sri rama rama rameti rame rame manorame
sahasra nama tat tulyam rama nama varanane
Lord replied "Chanting the name of Rama Rama and Rama is equal to chanting the whole of Vishnu Sahasra nama stotra ".
Shree-rama rama rameti 
rame raame mano-rame
Saha-sranaama tat tulyam
raama-naama varaa-nane
Shree-rama rama rameti 
rame raame mano-rame
Saha-sranaama tat tulyam
raama-naama varaa-nane
Shree-rama rama rameti 
rame raame mano-rame
Saha-sranaama tat tulyam 
raama-naama varaa-nane
Sree Raama-naama varaa-nana om nama iti
This Rama mantra is a portion taken from Vishnu sahasra nama stotra itself. Keep chanting this mantra. Uttering the name Rama once is equal to reciting the whole of Vishnu Sahasranama stotra. 
Reciting Vishnu Sahasranama Stotra regularly during brahma muhurtham is considered auspicious. It can give solution to your day to day problems. If you need protection from enemies, solution to financial problems, solution to depression or health problems, this can be a one stop solution for all these and give inner peace.
Meaning of Rama Mantra - Sri Rama Rama Rameti
It is said that reciting the name 'Rama' one time is equal to reciting the whole Vishnusahasranama stotra one time. That means when we recite 'Rama' once, it is equal to reciting thousand names of the Lord. Again, the term 'Krishna' is equal to reciting the name Rama three times. So reciting 'Krishna' once means reciting the Lord's name three thousand times.
'Rama' who is all attractive, attracts us towards him. Chanting of the name 'Rama' is equal to chanting the thousand names of Vishnu i.e, the Vishnu Sahasranama Stotra.
Rama mantra gives the same effect as chanting vishnusahara nama stotra. It is a part taken from vishnu sahasranama stotram itself.
You can also try Maha Sudarsana Mantra for protection from enemies and Narasimha maha mantra and enjoy the presence of Krishna in all walks of your life.
సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి.
లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే' అనే ఆలోచన కలిగింది.దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా!
రామాయణం కంటే బలమైన రామనామం 
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో "రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు" అని రాముడిని ఆదేశించాడు.
విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు 'రామ' నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. 'రామ' నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని "మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? 'రామ' నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి" అని విశ్వామిత్రుడితో చెప్పాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం 'రామనామం.'
'రామత్తత్వో అధికం నామ 
మితి మాన్యా మహేవయమ్ 
త్వయై కాతౌతారి తయోధ్యా 
నామ్నుతు భువన త్రయమ్'
అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం.
'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రంలోని 'రా' అనే ఐదవ అక్షరం ' ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రంలోని 'మ' అనే రెండవ అక్షరం కలిస్తే ' రామ' అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనాయం!
'రామ' అనే పదాన్ని గమనిస్తే ర, అ, మ లు కలిస్తే 'రామ' అవుతుంది.'ర' అంటే అగ్ని. 'ఆ' అంటే సూర్యుడు, 'మ' అంటే చంద్రుడు అని అర్థం. అంటే 'రామ' అనే పథంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా 'రామ' అనే నామంలోని 'రా' అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ 'మ' అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా 'రామ' అనే పదంలోని 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, 'మ' అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు
'శ్రీరామ రామరామేతి రమే రామ మనోరమే 
సహస్త్రనాయ తత్తుల్యం రామనామ వరాననే' అని పేర్కొన్నారు.
'రామ రామ రామ' అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీవిష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.
కిరాతకుడిని వాల్మీకిని చేసిన రామనామం 
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా 'మరా' అనే మాటను జపం చేస్తూ కొంతకాలానికి 'మరా' అనే పదం 'రామ' గా మారింది. ఆయనపై వల్మీకం (పుట్ట) పెరిగింది. చివరకు నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామనామ గొప్పదనాన్ని తెలుసుకొని 'వాల్మీకి' ఆయి రామాయణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామనామం గొప్పది.
శనిబాధాలు చేరనివ్వని రామనామం 
పూర్వం ఒకసారి శనేశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుడిని సమీపించి శనేశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా "నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగివున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు" అని సమాధానం ఇచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు మిగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడి దరి చేరనీయని శక్తివంతమైన నామం 'రామనామం' కాబట్టి 'రామ' నామాన్ని జపించే వారి శనిబాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్పబడుతుంది.
హనుమంతుని రక్షగా ఉంచే రామనామం 
'యత్ర యత్ర రఘునాథ కీర్తనం 
తత్ర తత్ర కృత మస్తకాంజలి 
బాష్పవారి పరిపూర్ణలోచనం 
మారుతీం సమత రాక్షసాంతకం'
అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళునిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ ప్రక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం 'రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది.
రామనామ సంకీర్తన 
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 
రామనామము రామ నామము రామ నామము రామ నామము 
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము 
దారినొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామనామము...
ఇలా ప్రారంభమై సాగే రామనామసంకీర్తనను ప్రతిరోజూ 'ఉభయ' సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఎటువంటి సమస్యలైనా గట్టెక్కే ధైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్త్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.
నామమంత్రం 
'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామరక్ష.
రామకోటి 
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం 
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం 
అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

Saturday, 30 January 2016

BIRTH STORY OF LORD HANUMAN


 హనుమంతుని యొక్క జన్మ రహస్యం

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. 

హనుమాన్ జన్మ కథ, అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు, అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో, కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న కోతిని చూసి, ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా, చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది, కోపంతో అంజనను, ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా, ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి, వెంటనే ఆమె కోతిరూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన, ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు, అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు, అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు, అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు, గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె కోతి ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను, తన తండ్రిఅయిన కేసరి, తల్లి, అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

హనుమాన్, ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు, రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ, మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

REAL RAMAYANA STORY ABOUT KUMBHA KARNA


రామాయణంలో కుంబకర్ణుడి మరణం కథ..!

కుంబకర్ణడు సంవత్సరం అంటే ఇయర్ లో ఆరు నెలలు నిద్రపోతూనే ఉంటాడు. మేల్కొన్నప్పుడు ఆ ఆరునెలల ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. మళ్ళీ ఆరు నెలలు నిద్ర. ఇలా అన్నమాట. అతని శరీరం కొండంత పెద్దగా ఉంటుంది. పైగా అతడు చాలా బలవంతుడు కూడా. అలాంటి కుంబకర్ణుడికీ ఒక కథ ఉంది ఆ కథ గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథ చదవాల్సిందే...

* కుంబకర్ణ అంటే అర్థం

రామ మరియు లక్ష్మణుడు, ఇద్దరూ కూడా రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని సోదరుడు,కుంభకర్ణుడిని నిద్ర నుండి మేల్కొలపవలసిన అవసరం ఉన్నదని కనుగొన్నారు. కుంభ అంటే అర్థం ఒక రకమైన నీటి కుండ; కర్ణ అంటే వినికిడి అని అర్థం. కుంభకర్ణుడు తాటిచెట్టంత ఎత్తు ఉండి, అపారమైన శరీర పరిమాణం గల ఒక దిగ్గజం మరియు అతను ఆరు నెలల కాలం నిరంతరం నిద్ర పోతుంటాడని మరియు అతను నిద్ర నుండి మేల్కొనగానే ఏది కనపడినా,తన మార్గంలో ఏది ఎదురైనా ప్రతిదీ తినేస్తాడని చెప్పబడిఉన్నది.

* కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర

అతను నిద్ర మేల్కునే రోజు అతని ముందు ఎవరూ నిలబడలేరని రామాయణంలో చెప్పబడింది. కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర పూర్తి కాకముందే రావణాసురుడు మేల్కొల్పాడని మరియు అతనిని యుద్దానికి వెళ్ళమని సూచించాడని ఒక విచలనం ఉన్నది.

* యుద్ధం కోసం కుంభకర్ణుడు

యుద్ధం కోసం కుంభకర్ణుడు సిద్ధంగా ఉన్నాడని విభీషణుడు వినగానే, అతను రాముడితో " నా ప్రభువా, ఇది మరొక గొప్ప ప్రమాదం, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కుంభకర్ణుడు మీరు ఎప్పుడు చూడనటువంటి చాలా ప్రమాదకరమైన ఒక దెయ్యం. ఆధ్యాత్మికత గురించి వినటం చాలా సాధారణం, కాని ఈ కుంభకర్ణుడిని చూస్తే మీరు ఆధ్యాత్మికత గురించి మర్చిపోతారు మరియు ఆధ్యాత్మికత గురించి అనేక బాహ్య కల్పనలు, మాయలు మరియు మంత్రాలు సేకరించాలని అనుకుంటారు. కేవలం ఆధ్యాత్మికత యొక్క పదాలు వింటూ, మీకు పూర్తి జ్ఞానం కలిగినట్లుగా, ప్రతిదీ తెలుసు అన్న అనుభూతికి లోనవుతారు మరియు ఆచరణాత్మక ధ్యానం నుండి ఇది ఒక విచలనం మరియు దాదాపు ఒక స్థిరమైన నిద్ర అనే చీకటి వంటిది.

* కుంభకర్ణుని లక్షణాలు

ఇక్కడ, విభీషణుడు దైవ సంకల్పంతో, మనో నిబ్బరంతో ఈ విధంగా సూచించాడు. 'నా ప్రభువా! ఇవి కుంభకర్ణుని లక్షణాలు. అతనిని చంపగలిగినవాడు, మొదటగా పద్నాలుగు సంవత్సరాలపాటు పగలు, రాత్రి ఎటువంటి నిద్రపోనివాడు మరియు రెండవది గత పద్నాలుగు సంవత్సరాలపాటు ఏమీ ఆహారం తీసుకోనివాడు అయి ఉండాలి."

రాముడు చాలా కృంగిపోయి, అతను "ఎక్కడ నుండి అటువంటి వ్యక్తిని తెగలను?" అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు "నేను తిండి మరియు నిద్ర లేకుండా గత పద్నాలుగు సంవత్సరాలుగా జీవిస్తున్నాను. కాబట్టి నేనే తనను చంపగలిగే వాడిని" అని చెప్పాడు.

* బహుణ స్రుతేణ - మరియు కుంభకర్ణుడు

ఇది యుద్ధం రెండవ రోజున కుంభకర్ణుడితో చెప్పబడింది, యుద్ధం మొదటిరోజున కుంభకర్ణుడు ఇద్దరు సోదరులు చాలా శక్తివంతమైనవారుగా గ్రహించాడు, తన శక్తియుక్తులకు సరితూగగలిగేవారు అని కానీ రాముడి ప్రమాణాలకు తాను సరిపోక పోవచ్చు అని గ్రహించాడు మరియు - అందువలననే ఆధ్యాత్మికత కేవలం వినడం ద్వారా సాధించలేరు అని వేదాలలో చెప్పబడింది - న బహుణ స్రుతేణ - మరియు కుంభకర్ణుడు, తన నిజమైన సవాలు తమ్ముడు, లక్ష్మణుడే అని భావించాడు.

* రావణుడికి యుద్ధ పురోగతిని

అతను తన సోదరుడు, ఐదవ అంతస్తులో నిలబడి ఉన్న రావణుడికి యుద్ధ పురోగతిని వివరించటానికి వెళ్ళాడు. ఐదవ అంతస్తు విసుధ చక్ర (వెన్నెముకలో గర్భాశయ కేంద్రభాగం) ఆకారంలో ఉండి, శబ్దం ప్రతిధ్వని ఇస్తున్నది.

* కుంభకర్ణుడు అతనికి యుద్ధ విశేషాలను వివరిస్తూ ఇలా చెపుతున్నాడు

కుంభకర్ణుడు అతనికి యుద్ధ విశేషాలను వివరిస్తూ ఇలా చెపుతున్నాడు 'నా సోదరా! ఇది ఒక గొప్ప విజయం, కానీ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఇద్దరు సోదరులు గొప్ప యోధులు. నేను ఇటువంటి 'నరవీరులు' (మానవ హీరో, మానవ యోధుడు) ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. బహుశా వీరు ఇద్దరూ స్వయంగా దైవ అవతారపురుషులేమో అని నాకు ఒక అనుమానం కలిగుతున్నది. '

* రావణుడు చాలా కోపంతో

అప్పుడు రావణుడు చాలా కోపంతో ఈ విధంగా సమాధానమిచ్చాడు 'నేను ఇలాంటి బలహీనత మరియు నిరుత్సాహ పదాలు నా సోదరుడు నుండి వినదలుచుకోలేదు. నీవు ఒక పిరికిపందలాగా మాట్లాడటం తగదు. నీవు రావణుని సోదరుడు అని మర్చిపోవోద్దు.

* కుంభకర్ణుడు మరణం

కుంభకర్ణుడు చాలా నిరుత్శాహపడి తన సోదరుడితో ఇలా అన్నాడు " సోదరా! ఎప్పుడూ నేను బలహీనపడలేదు, నేను ఎప్పుడూ పిరికివాడిని కాను, కాలేదు కానీ ఒక నిజం అంగీకరించాలి. నేను నీ చిన్న తమ్ముడిని, నీకు ఏ విధమైన సలహాలను ఇవ్వలేను సరే! కానీ రేపు జరగబోయే యుద్ధంలో నేను మరణిస్తే మీరు లొంగిపోవాలని, స్వర్ణ లంక రక్షింపబడాలని ప్రార్థిస్తున్నాను.' మరుసటి రోజు జరిగిన యుద్ధంలో కుంభకర్ణుడు చంపబడ్డాడు.

Sunday, 1 February 2015

LORD SRI RAMA - LORD HANUMAN'S SUNDARA KANDA - RAMAYAN STORIES IN TELUGU


శ్రీ రామః
(సుందర కాండము)

రామాయణం
రామాయాః అయనమ్ = రాముని యొక్క చరిత్రము రామాయణము

రామః అయ్యతే ఇతి రామాయణమ్
అనగా దీనిని పఠించినవారు రాముని వలె ధర్మశీలురై జీవనము గడిపి
కడకు వైకుంఠ ప్రాప్తి పొందుదురు

శ్రీరాముడు మానవాళికి ఆవశ్యములగు పుత్ర ధర్మము, మిత్ర ధర్మము, భ్రాతృ ధర్మము(సోదర), భర్తృ ధర్మము(భర్త), శిష్య ధర్మము, క్షాత్ర ధర్మము, శతృ ధర్మము, మొదలగు అన్ని ధర్మములను తానే స్వయముగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడాయెను
సీతా మాతయు స్త్రీలకు ఆచరణీయమగు సమస్త ధర్మములను నిజజీవితంలో ఆచరించి లోకమునకు ప్రకటించెను

రామాయణం కావ్యమగుటచేత ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథమైనది

మానవుని జీవితంలో ధర్మము, అర్థము, కామ్యము, అను మూడు పురుషార్థములను సాధింపదగినవి, ఈ త్రివర్గమునకు ధర్మము మూలమి,ధర్మ బద్ధము గాని రెండును అనర్ధ హేతువులు ధర్మమునకు విరుద్ధమైన పచ్చి స్వార్థముతో భరతునకు రాజ్యమును కట్టబెట్టచూసిన కైక నలుగురిలో నవ్వులపాలై లోక నిందకు గురియైనది అట్లే ధర్మమును వీడి కామాతురుడు పరసతులను ఆసించిన దుష్ట రావణుడు లోకమున అపకీర్తి పాలయ్యెను సపరివారముగా నశించెను
ధర్మ భద్ధుడై రాజ్యమునే పరిత్యజించిన శ్రీ రాముడు సకల లోకాలకు మార్ధర్శకుడే కాక లోకారాధ్యుడాయెను

కావుననే

"రామో విగ్రహవాన్ ధర్మః"
(శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మము)
అని వాల్మికి మహర్షి నుడివెను

అందువలననే

"ధర్మో రక్షతి రక్షితః"
(ధర్మమును ఆశ్రయించిన వానిని ఆ ధర్మమే కాపాడును)
అను సూక్తి ఏర్పడినది

శ్రీ రామాదుల బాల్యలీలలబు వర్ణించినందున అది "బాలాకాండము"గా
పట్టాభిషేక సన్నివేశాలు అయోధ్య నగరమున సంభవించేను కనుక అది "అయోధ్య కాండము"గా
సీతారాముల అరణ్యవాస విశేషాలను వివరించెను కనుక అది "అరణ్య కాండము"గా
రామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ మొదలగునవి కిష్కంద యందు జరుగుటచే అది "కిష్కింధ కాండము" గా
రామ రావణుల యుద్ధ ప్రాముఖ్యముతో అది "యుద్ధ కాండము" గా ప్రసిద్ధిచెందగా
కిష్కందకాండము యుద్ధకాండమునకు మధ్యన కల వస్తు సౌందర్యము సీతా రామ హనుమదాదుల సౌందర్యము హనుమంతునకు సీతాన్వేషణలో ఎదురైన ఘట్టముల వైభవమును లంకా సౌందర్యము అశోకవన సౌందర్యము మున్నగు వర్ణములను "సుందరకాండము"గా అభివర్ణించిరి

సుందరాకాండము:

"సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం"

పురుష మోహనాకారుడు, సుగుణ సుందరుడు శ్రీరాముడు
సర్వ విధముల భువనైక సుందరీ సీతామాత
కాంచనాద్రి కమనీయ విగ్రహుడు పరమ సుందరుడు హనుమంతుడు
అతొలోక సుందరము అశోకవనము
శ్రీ సీతా రామ హనుమంతుల మంత్రముకు దివ్య పరమ సుందరములు
మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము
సుందరకాండము బహుముఖ వైభవ వర్ణన కల కవిత్వ కావ్యం అత్యంత సుందరము కనుక సుందర కాండము నందు "సుందరము" కానిదేది..??
సర్వము సుందరమే...

అంతటి మహత్తరమైన సుందరకాండము నియమ నిష్టతో పారయణము చేయుట వలన సుఖల దుఃఖములు నివారణమగును సకల మనోరథములు సిద్ధించును
హరిషడ్వర్గములు జయించును బ్రహ్మ జ్ఞానము పొందగలరు
అంతయే కాక అశ్వమేధ యాగఫలాన్ని పొందునని వాల్మీకి వాక్యము..

"శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష"

Monday, 19 January 2015

RAMAYAN STORIES IN TELUGU - SUNDARAKANDA POEM AND ITS MEANING IN TELUGU



సుందర కాండ శ్లోకము - వివరణ

శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః

తా - లంకకు రాగలుగుటకు నలుగురికే సాధ్యము. వాలి పుత్రుడైన అంగదుడు, నీలుడు, బుద్ధిశాలి యగు మా ఏలిక సుగ్రీవుడు మరియు నేను (ఆంజనేయ స్వామి)

వివరణ - ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...

వ్యాఖ్యానము - జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ... రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.

ఇక్కడ మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి... సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది. అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక... వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు. అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ, అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని సద్గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు

Saturday, 20 December 2014

TELUGU RAMAYANA PURANA STORY ABOUT AHALYA AND THE CURSE OF AHALYA


ఇంద్రుని వల్ల శాపగ్రస్తులైన అహల్య గాధ 

ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...

పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.

అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... ‘‘ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు’’ అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.

ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.

అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. ‘‘కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే’’ అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.

గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. ‘‘నువ్వు రాయిగా మారిపో’’ అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.

ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. ‘‘రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు’’ అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.

అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.

Tuesday, 28 October 2014

RAMAYANAM STORIES IN TELUGU - ARTICLE ABOUT FACTS ABOUT LORD SRI RAMA - VANAVASAM

 
శ్రీ రామ వనవాసం

శ్రీ రామ చరిత్రలో అతిముఖ్యమైనదీ సుదీర్ఘమైనదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్లు వచ్చే వరకూ వనసీమలలోనే సంచరించాడు.శ్రీ రాముడు మనదేశంలో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకూ ప్రయాణం చేశాడు.ఆతరు
వాత సేతు నిర్మాణం గావించి లంకలో రావణ సంహారం చేసాడు.ఇంత కాలం పాటు ఆయన ఏయే చోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.

* శ్రీ రాముడు తన వన వాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకుందాం

అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ విస్త్రృతంగా పర్యటించారు.ఆయాప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలనుబట్టి వారు మొదట 189 ప్రాంతాలనూ తరువాత మరోక 60 ప్రదేశాలనూ కనుగొన్నారట.ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి “శ్రీ రాముని అడుగు జాడల్లో” శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యనుంచి బయలుదేరి మొదట అక్కడికి 20 కిలో మీటర్లు దూరం లోని తమసానదీ తటాన ఉన్న మాండా అనే ప్రాతాన్ని చేరుకున్నారు.ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. 

ఆతరువాత తమ కోసల దేశపు సరిహద్దులుదాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కిలో మీటర్ల దూరంలోని నిషాద రాజ్యం లోని శ్రింగవేరపురం చేరుకున్నారు.ఆ తర్వాత అక్కడనుండి బయలు దేరి త్రివేణీ సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర-మధ్యప్రదేశ్ ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని చేరుకున్నారు.ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం,మాండవ్య ఆశ్రమం,భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు చిత్రకూటాన్ని వదలి మధ్యప్రదేశ్ లోని సతానా ప్రాంతంలో ఉన్నఅత్రి ఆశ్రమాన్ని చేరుకున్నారు.ఇక్కడనుండి శ్రీ రాముడు ఇప్పటిమధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు.దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది సంవత్సరాలు విహరించాడు.

ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్షసంపద వారినంతగా ఆకర్షించాయేమో? సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకుని నర్మదా మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేక మైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికి చేరుకున్నారు.ఇప్పటికీ పన్నా, రాయపూర్,బస్తర్, జగదల్ పూర్ ప్రాంతాలలో మాండవ్య ఆశ్రమం, శ్రింగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం కోటిమాహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైనచిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు నాసిక్ ప్రాంతం లోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు.ఇక్కడి అగ్ని శాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు.

అగస్త్యాశ్రమం నుంచి బయల్దేరిన శ్రీ రాముడు నాసిక్ సమీపం లోని పంచవటి చేరుకున్నాడు.ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలుండడం వల్ల ప్రదేశానికా పేరు వచ్చింది.శూర్పణఖ వృత్తాతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతమిదే.(ఖరదూషణుల వధ క్రీ.పూ 5077 5077 అక్టోబరు 7 వ తేదీన జరిగిందని ఇంతకుముందే చెప్పుకున్నాం). ఈ ప్రాతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్ వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలిప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు—

సీతాసరోవరం రామకుండం,త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి.సీతాపహరణం జరిగినదీ ప్రదేశం లోనే.సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు సర్వతీర్థమని పిలువబడుతోంది.ఇది నాసిక్ పట్టణానికి 56 కి.మీ. దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది.

సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామ లక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నారు. ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఆ ఆశ్రమమున్న పంపాసరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రం లోని బెల్గాం దగ్గరున్న సురేబన్ గా గుర్తించబడింది.ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండడం విశేషం.(భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించిందన్నది ఐతిహ్యం). ఇక్కడినుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూ దాటుకుంటూ శ్రీ రామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం, కిష్కంధ ప్రస్తుత కర్నాటక బళ్ళారి జిల్లా లోని హంపీ ప్రాంతం.ఇక్కడే వారు హనుమాన్ సుగ్రీవులను కలుసుకోవడం వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.

ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు.మలయ పర్వతాన్నీ గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూ దాటుకుంటూ కావేరీ తీరం చేరాడు.ఆ తర్వాత తిరుచ్చిరాపల్లి తంజావూరు రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు.

*****(చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగా సరి పోవడం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతం గా చెప్పబడ్డ పరిసరాల్లో (కోల్డిహ్వా, ఝూసీ,హేటాపట్టి లలో) పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాతం క్రీ.పూ. ఆరు ఏడు వేల సంవత్సరాలనుంచీ జనావాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి..త్రివేణీ సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్ (నెహ్రూ గారిఇల్లు) కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడా శృంగవేరపురాల్లోనూ జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్య మైన ఆధారాలు లభ్యమయాయి.)