WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Festival Articles. Show all posts
Showing posts with label Festival Articles. Show all posts

Monday, 19 January 2015

ARTICLE IN TELUGU ABOUT SRI SUBRAHMANYA SHASTI FESTIVAL PUJA


సుబ్రహ్మణ్య షష్ఠి 

సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 

అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు.

ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.

పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

Tuesday, 14 January 2014

CULTURAL IMPORTANCE OF SOUTH INDIAN FESTIVAL SANKRANTHI - ARTICLE IN TELUGU ON SANKRANTHI FESTIVAL CELEBRATIONS

సంక్రాంతి సందడులలో భాగంగా పల్లె వాతావరణం జంట సన్నాయిల నాదం మధ్య 
డూడూ బసవన్నల అద్భుత విన్యాసాలతో ,హరిదాసుల హరినామ సంకీర్తనలతో 
వీధులన్నీసందడులతో పల్లెసీమ పండుగ శోభను సంతరించుకుంటుంది


భోగి పండుగ రోజున సాయంత్రం 7 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు 
పోస్తారు.రేగు పండ్లతో పాటు పూలు ,చెరకు ముక్కలు ,డబ్బుల నాణాలు 
పిల్లల తల పై ధారగా పోస్తారు .ఈ పళ్లలో వున్న గుజ్జు చంద్ర తత్వానికి ,రేగు పండు గింజ భూ తత్వానికి ప్రతీక .సూర్య చంద్రులు ,భూమాత యొక్క శక్తి యుక్తులు పిల్లలకు అందాలనే ఆకాంక్ష ఈ వేడుకలో కన్పిస్తుంది .


సంక్రాంతి పండుగలో మొదటిరోజైన 'భోగి ''రోజున ఇంట్లోని పిల్లలకు ఆరోగ్యాన్ని మేధోశక్తిని ప్రసాదించమని సూర్య భగవానుడిని వేడుకుంటాము తెల్లవారుజామునే పిల్లలందరిని నిద్ర లేపి ఇంటిలోని పనికిరాని వస్తువులను అన్నింటిని కుప్పగా పేర్చి భోగిమంటలు వేస్తారు ...పిల్లలందరూ ఆ మంట చుట్టూ కూర్చుని వెచ్చ 
దనాన్నిపొందుతారు ...ఆ తరువాత తలంటు స్నానాలు చేస్తారు .సూర్య భగవానుడుని ఆరాదిస్తే అందరూ దేవతలను పూజించినట్లేనని ఈ భోగి మంట యొక్క పరమార్దం ..


తల్లి ముగ్గులు పెడుతూ ఆడపిల్లలకు సృజనాత్మకత కళా వైభవాన్ని నేర్పే విధానం 
ఈ పండుగలో మనకు కన్పిస్తుంది .తెలవారుజామునే లేచి మగువలు తీర్చే రంగు రంగుల అందాల ముగ్గులు ,వాటి పై బంతి పూలతో అలంకరించిన గోబ్బెమ్మలు,నవధాన్యాలు,ఆ రంగవల్లుల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాడుకునే గొబ్బిపాటలు ఈ పండుగలో విశేషంగా అందరినీ ఆకర్షిస్తుంది ...

ధనుర్మాసం ప్రారంభమైనప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళలో రంగవల్లులు వేస్తూ ''నెలపట్టు''పడతారు .కనుము రోజున రథం ముగ్గుతో ఈ 
నెలపట్టు ను విడుస్తారు .ఈ సంప్రదాయం ఈనాటిది కాదు .శ్రీ కృష్ణుని చెల్లెలు 
సుబద్ర ఆనాడే ముగ్గులతో యుద్ద వ్యూహాలను చూపించిందని పురాణ గాధలు 
తెలియచేస్తున్నాయి

సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణ .చుట్టూ ప్రక్కల ఇళ్లలోని ముత్తైదువులను ,ఆత్మీయులను పిలుచుకొని బొమ్మల కొలువును వేడుకగా 
చేసుకుంటారు .చిన్నప్పుడే పిల్లలకు మానవత్వ విలువలతో పాటు పురాణాలను 
సాంప్రదాయాలను తెలియచేసే క్రమంలో ఈ వేడుక జరుపుకుంటారు

ARTICLE ON THE HISTORY OF SANKRANTHI FESTIVAL IN TELUGU


సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. 

నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది. 

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.

సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.

కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.
సంక్రాంతి, ఆధ్యాత్మికం, భోగి, కనుమ, ముక్కనుమ