WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Health Articles. Show all posts
Showing posts with label Health Articles. Show all posts

Wednesday, 16 December 2015

AGE WISE HEALTH PROBLEMS - GROWING AGE HEALTH TIPS


ప్రపంచంలో అతి ఎక్కువకాలం బ్రతికినట్లు గిన్నీసుబుక్‌లో నమోదయిన మనిషి పేరు షిజిచియో లుజుమి. ఉత్తర జపాన్‌దీవుల్లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన ఇతడు 120 సంవత్సరాల 237 రోజులు జీవించాడు. 1986లో ఇతడు నిమో నియా వ్యాధితో మరణించాడు. తాను అంతకాలం బ్రతకడానికి బుద్దభగవానుడు, సూర్యుడు కారణ మని అతడు అభిప్రాయపడ్డాడు. అయితే మానవ జాతి 120 సంవత్సరాలు వయసుకు ముందే మరణించడం జరుగుతోంది. నడివయసునుండి శరీరం శిథిలంకావడం మొదలవుతుంది. ఆడ, మగ, ఇద్దరిలోను ఈ వయసునుండి క్రీడా సామర్థ్యాలు తగ్గడం ఆడవారిలో మెనోపాజ్‌ ఎదుర వ్వడం జరుగుతూ ఉంటుంది. అరవై సంవత్సరాలు వయసు వచ్చేసరికి రోగాలు శరీరంమీద దండ యాత్రలు చేస్తూ ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోక పోతే కండరాలు, ఎముకల పటిష్టత తగ్గుతుంది. వ్యాయామం చేయకపోయినా ఈ పరిస్థితి తప్పదు. మానసిక ఇబ్బందులు ఏ విధంగా ఎదురవుతాయో స్పష్టంగా వర్గీకరించి చెప్పలేము. అయితే చాలా మంది వ్యక్తులలో మానసిక చురుకుదనం, బలం ఎనభై సంవత్సరాల వయసు వచ్చినా జంకవు. చాలా కొద్దిమందిలో 'ఆల్జీమర్స్‌' వంటి వ్యాధులు కన్పిస్తూ ఉంటాయి.

20 ఏళ్ళ ప్రాయంలో...
ఖీ మనిషి శారీరకంగా మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. మంచి బలం ఉంటుంది. కండర బలం, గుండెబలం తారాస్థాయిలో ఉం టాయి. వ్యాయామంతో మనిషి మరింత సమర్థవంతంగా తయారవుతాడు.
ఖీ శరీరంలో ఇమ్యూనిటివ్యవస్థ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఇక ఏ వయసులోను ఇటువంటి స్థితి ఇమ్యూనిటీ వ్యవస్థకు ఉండదు.
ఖీ మానసిక శక్తి గరిష్టస్థాయిలో ఉంటుంది. నైపుణ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి.
ఖీ వినికిడి, దృష్టి ఎంతో సునిశితంగా, స్పష్టం గా ఉంటాయి.
ఖీ ఈ వయసులో కాన్సర్‌వంటి వ్యాధులు సోకవు.
40 ఏళ్ల వయసులో...
ఖీ మహిళల విషయంలో 48 సంవత్సరాలు వచ్చేసరికి సాధారణంగా మెనోపాజ్‌ అనుభవాలు ఎదురవుతాయి. కొంతమందికి ఇంకా ముందునుండి మొదలుకావచ్చు.
ఖీ ఎముకలు క్షీణించడం ఆరంభం అవుతుంది.
ఖీ ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిం చగల శక్తి ఉన్నతంగా ఉంటుంది.
ఖీ మగవారిలో బట్టతలఏర్పడడం మొదలవుతుంది.
ఖీ ఆడ, మగవారిలో 5వేల మందిలో ఒకరికి రెక్టర్‌ కాన్సర్‌వచ్చే అవకాశం ఉంటుంది. 700 మంది ఆడవారిలో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ రావచ్చు.
60 ఏళ్లు దాటితే...
ఖీ పెద్ద మెదడులోని ధమనుల (రక్తనాణాలు) గోడల్లో కొవ్వు పేర్కొని రక్తస్వేచ్ఛా ప్రవాహా నికి ఆటంకం ఏర్పడి పక్షవాతం, గుండె పోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఖీ తలజుట్టు రంగు కోల్పోతూ తెల్లజుట్టు దర్శనం ఇస్తుంది.
ఖీ లైంగిక వాంఛ సాధారణంగా తగ్గిపోతుంది. కొంతమందికయితే ఉండదు.
ఖీ మనుషుల్లో వందలో ఒకరికి క్రమంగా గణిత సామర్థ్యం మానసికంగా తగ్గిపోవడం ఆరంభం అవుతుంది. లెక్కలువేసి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడంలో అసమర్థత ఎదురవు తుంది.
ఖీ ప్రతి 600 మందిలో ఒకరికి రెక్టల్‌ కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల్లో ప్రతి 450మందిలో ఒకరికి బ్రెస్టుకాన్సర్‌రావచ్చు.
80 ఏళ్ల ముదిమి వయసులో...
ఖీ ఈ వయసులోగల పదిశాతం వృద్ధులకు పార్కిన్‌సన్స్‌ వ్యాధి లేదా ఆల్జీమర్స్‌ వస్తుంది.
ఖీ యిరవయిల్లోవున్న కండరబలంలో నాల్గో వంతు బలం కండరాలు కోల్పోతాయి. ఇంకా ఎక్కువవంతు కూడా నష్టం కల్గవచ్చు.
ఖీ సాధారణంగా కీళ్ల వ్యాధులు వచ్చే పరిస్థితి హెచ్చుగా ఉంటుంది.
ఖీ ఏదో ఒక మానసిక సామర్థ్యం తగ్గిపోయే అవకాశం 85 శాతం ఉంటుంది.
ఖీ 250మందిలో ఒకరికి రెక్టల్‌కాన్సర్‌ రావచ్చు. 300 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 50 మందిలో ఒకరికి తుంటి ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్రయోగాలు :
హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోనును కొంతమంది వయోవృద్ధులకు వైద్యులు ప్రయోగాత్మకంగా ఇచ్చారు. సాధారణంగా వయో వృద్ధులలో ఈ హార్మోనుతక్కువగా ఉంటుంది. వీరంతా ఈ హార్మోను ప్రభావంవల్ల మామూలుకన్నా శక్తివంతులయ్యారు.
వీరి కండరశక్తి 10 శాతం పెరిగింది. కొవ్వు 14 శాతం, చర్మం 7 శాతం దళసరి అయ్యింది. నా జీవితంలో మళ్లీ ఇంతబలం వస్తుందనుకోలేదు అన్నాడు ఒక వృద్దుడు. ఈ మందు ముసలితనాన్ని తాత్కాలికంగా కొంత వాయిదా వేస్తుందని భావిస్తున్నారు. ముదిమి వయసులో చాలా వాక్సీన్లు పని చేయవు. వీరిలో డిహెచ్‌ఇఎ అనే సహజ సిద్ధమైన హార్మోను బాగా తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల శరీర రోగనిరోధకశక్తి తగ్గి జబ్బులను ఎదుర్కొన గల శక్తి శరీరానికి తగ్గిపోతుంది. ఈ హార్మోను శరీరానికి అందిస్తే జీవితకాలం మరింత పెరుగు తుందా? అన్నీ ప్రయోగాల దశలో ఉన్నాయి..వేచి చూడాలి.

Tuesday, 28 October 2014

TIPS FOR REDUCING THE SIZE OF STOMACH

 
పొట్ట రాకూడదని అనుకునేవారు, వచ్చినా దాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలు

1. కప్పు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడపున తాగాలి. రోజులో కూడా ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు వెళ్తాయి.
2. పకృతి సహజంగా లభించే తేయాకులతో చేసిన గ్రీన్‌టీని ఉదయం పూట తాగాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగతా అన్ని రకాల జ్యూస్‌లను ఉదయ
ాన్నే తీసుకోవచ్చు. అయితే జ్యూస్ కంటే తాజా పళ్లు తీసుకోవడం మంచిది. జ్యూస్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
3. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి. 
4· పంచదారను ఏ రూపంలోనూ తీసుకోకూడదు. అలాగే వైట్ పాస్తా, బ్రెడ్, బంగాళదుంపలు తినకూడదు.
5· గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు. ప్యాకెట్ లేబుల్స్ పైన ఏ పిండిని ఉపయోగించారు అనేది రాసి ఉంటుంది. చెక్ చేసుకుని తీసుకోవాలి.
6· అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవచ్చు. మాంసాహారం తక్కువ తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకోవాలన్న కోరిక ఉంటే దానికి బదులు చేపలు తినవచ్చు.
7· రోజులో రెండు, మూడు సార్లు ఎక్కువ మోతాదులో కాకుండా అయిదుసార్లు కొద్ది మోతాదుల్లో ఆహారాన్ని తీసుకోవాలి.
8· రాత్రి ఏడు తర్వాత ఆహారం తీసుకోకూడదు.
9· తినే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. చిప్స్, పాప్‌కార్న్, కుకీస్, కేక్స్ మొదలైన జంక్‌ఫుడ్‌ని అస్సలు తినకూడదు. 
10· రోజుకు ఒక పండు తినాలి. దాన్ని ఉదయం 12గం.ల లోపు తినేలా చూసుకోవాలి. అవి కూడా బెర్రీ ఫ్యామిలీకి చెందిన బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్ బెర్రీస్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.
11· రోజులో అరగంట, నలభై అయిదు నిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యసమస్యలున్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయాలి.
12· పొటీన్లు సమృద్ధిగా ఉన్న డ్రింక్‌ని రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండి,
13· పోషకాలు అస్సలు ఉండని కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
14· తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లేదా సీడ్స్‌ని తీసుకోవాలి. రోజులో ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
15· మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే స్ట్రెస్ హార్మోన్లు రిలాక్స్ అయి పొట్టపైన ప్రభావం చూపకుండా ఉంటుంది. 
16· స్నాక్స్‌లో రోజులో నాలుగు సార్లు అయిదు బాదాంల చొప్పున తినాలి.
17· తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
18· స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.
19· వేపుడు పదార్థాలను తీసుకోకూడదు. కేవలం ఉడికించిన వాటినే తీసుకోవాలి.


Friday, 1 August 2014

HEALTHY IMPORTANCE OF DRINKING COW MILK


ఆవు పాలు గురించిన వివరణలు
భారత దేశీయ ఆవు పాలు శరీర నిర్మాణమునకు అత్యవసరమైన ఆహారము.
ఆవుపాలయందు మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్లు, సేంద్రీయ లవణములు (Minerals) కలవు. ఆవు పాలలోని మాంసకృత్తులయందు దేహనిర్మాణమున కవసరమగు యాసిడ్స్ (Amino Acids) కలవు. అవి చాలా తేలికగా జీర్ణమగు ఆల్బుమిన్ (Albumin) రూపములో ఉండును.పాలయందలి కొవ్వు-వెన్న రూపములో సూక్ష్మాతి సూక్ష్మమైన కణములుగా విభజింపబడి ఉండును. ఆవు పాలయందలి కార్బోహైడ్రేట్‌లు అతితేలికగా జీర్ణమగు లాక్టోస్‌ రూపములో ఉండును. ఆవుపాలయందు రోగనిరోధక శక్తిని అధికముగా పెంచు విటమిన్‌ "ఎ" అధికముగా ఉండును. ఈ పాలలోని "డి" విటమిన్‌ వలన ఎముకలు బలపును. బి కాంప్లెక్స్‌, బి12 విటమినులతో నాడుమండలము బలపును. ఆవుపాలయందు శరీరధాతు నిర్మాణమునకు ఉపయోగపు కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం ఉన్నాయి. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన "స్వర్ణనాడి" (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మ నాడు ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది. సూర్యకిరణములు ఆవు మూపురముపై పినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని "కెసీిన్‌" అనే ఎంజైమ్‌ను తయారుచేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి.

Saturday, 22 February 2014

SALT - USES TO HUMANS - ADVANTAGES AND DISADVANTAGES OF USING SALT - BRIEF ARTICLE ON SALT


'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పువాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది మంచినీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగద్విదితమే. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. 

సాధారణంగా మన శరీరానికి ఉప్పు రోజుకు సుమారుగా 4 గ్రాములు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొలతలతో తీసుకోరు కనుక ఉప్పును చాలామంది అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉప్పును ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా వాడే వారికి అధిక రక్తపోటు వస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. అలాగే అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తపోటు వచ్చిన వారు పలు విధాల మందులను ఎక్కువగా వాడకుండా సాధ్యమైనంత తక్కువగా ఉప్పును వాడటం ద్వారా రక్తపోటు చాలామటుకు అదుపులో ఉంచుకోవచ్చునని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

రక్తపోటు తగ్గేందుకు వాడే మందులవల్ల కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడంతో పాటు గుండె జబ్బులు వంటి అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరించడమేకాదు, రక్తపోటును తగ్గించుకోవడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమనికూడా చెబుతున్నారు.

చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువగా తినడం, ఊరగాయలు ఎక్కువగా తినడం వల్ల వారిలో ఉదర సంబంధమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేసే కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్‌ను తినిపిస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఫాస్ట్‌ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

నేడు ఎంతోమంది జరిపిన పరిశోధనల్లో ఉప్పుకోసం ప్రత్యేకంగా ఉప్పును వాడనవసరం లేదని మనం రోజూవారీ తీసుకునే ఎక్కువగా వండని కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన ఉప్పు లభిస్తుందని పరిశోధనల్లో ద్వారా తేలింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఉప్పును అసలు తీసుకోకుండా ఉన్నట్లయితే నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఏర్పడతాయంటున్నారు. అందుకే ఉప్పును ఎంతవరకో అంతే తీసుకోవడం ఉత్తమం.

ఉప్పువల్ల కొన్ని లాభాలుకూడా ఉన్నాయి. ఉప్పును నీళ్ళల్లో కలిపి ఇంటిని శుభ్రంగా కడిగినట్లయితే ఈగలు కొన్ని గంటల వరకు నేలపై వాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీపం బుడ్డిలో పోసే కిరోసిన్‌లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం కాంతి ఎక్కువ కావడమేకాకుండా, కిరోసిన్‌ కూడా ఆదా అవుతుంది. ఈ విషయం తాతయ్య, నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది తెలిసే ఉంటుంది. నేటికి కూడా కిరోసిన్‌ దీపాలు వాడే చాలా ఇళ్ళల్లో ఇలా చేస్తుంటారు కూడా. వస్త్రాలమీద సిరా మరకలు ఉన్నట్లయితే ఉప్పుతో బాగా రుద్ది, వేడినీళ్ళతో కడిగినట్లయితే పోతాయి. 

నిల్వ ఉండే బియ్యంలో ఉప్పును చల్లినట్లయితే పురుగులు బియ్యానికి పట్టే అవకాశం లేదు. దానిలో ఉన్న పురుగులు కూడా పోతాయి. ఇలా ఉప్పు వల్ల చాలా లాభాలున్నాయి. అయితే శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక శరీరానికి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పునే వాడటం ద్వారా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

SECRET OF HEART BEAT


గుండె ఎలా కొట్టుకుంటుంది. 

భయం కలిగినప్పుడు దాని వేగం ఎందుకు పెరుగుతుంది? గుండె అనేది ఒక పంపులాంటిది. గుండె శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. దానివల్ల జీవించి వుండగలుగుతాము. ప్రతి ఒక్క కదలికకు సుమారు వంద క్యూబిక్‌ సెంటీమీటర్ల రక్తాన్ని బయటకు పంపుతుంది. ఒక్కరోజుకు సుమారు 10,000 లీటర్ల రక్తాన్ని రక్తనాళికల ద్వారా వంపుతుంది. మామూలు జీవిత కాలంలో సుమారు 250,000,000 లీటర్ల రక్తాన్ని వంపు చేస్తుంది. 8/10 సెకనుల కొకసారి గుండె కొట్టుకుంటుంది. ఒకరోజులో గుండె సుమారు ఒక లక్షసార్లు కొట్టుకోవడం, అన్నేసార్లు నిలిచివుండటం జరుగుతుంది. దినంలో అది సుమారు ఆరు గంటలు పనిచేయకుండా వూరికే వుంటుంది. గుండె చప్పుడంటే గుండె సంకోచ వ్యాకోచాలకు గురి కావటం అని అర్థం. గుండె సంకోచించి నప్పుడు రక్తాన్ని బయటకు పంపుతుంది. వ్యాకోచించినప్పుడు కొత్త రక్తం లోనికొస్తుంది. ఈ కొట్టుకోవడం దీనికెలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగానే వుండిపోయింది. కోడిగుడ్డును తీసుకుని దాన్ని ఇరవై ఆరుగంటలు ఇంకుటేట్‌ చేసి, తెరిచి, పరీక్షిస్తే, వాటిలో కోడిపిల్ల గుండెకు సంబంధించిన కణాలుకొట్టుకోవడం గమనించవచ్చు. గుండెగా తయారుకాకమునుపే ఈ కొట్టుకునే గుణం దానికి వచ్చింది. గుండెకు సంకోచమనే అభిలక్షణం అనుకోకుండానే వచ్చిందంటారు. శరీర జీవన విధానంలో ఇదో ప్రత్యేక రహస్యం. అది ఇంకా ఎవ్వరికీ అంతుబట్టలేదు.
మామూలుగా గుండె పెద్దవారిలో 70-72సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. ఆడవారిలో 78-82, పిల్లలలో 90సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. గుండె పేస్‌మేకర్‌ వల్ల గుండె ఈ విధంగా కొట్టు కుంటుంది. భయపడినపుడు, ఆపద వచ్చినపుడు 140సార్లు నిమిషంలో కొట్టుకుంటుంది. ఈ సందర్భంలో శరీరంలోని ఎడ్రినల్‌ గ్లాండు ఎడ్రినలైన్‌ అనే హార్మోనును రక్తంలోనికి పంపుతుంది. దీని వల్ల గుండె కొట్టుకోవడం ఎక్కువౌతుంది. రక్తపీడనం కూడా పెరుగుతుంది. సహజసిద్ధంగా వీటిని తట్టుకునేగుణం గుండెకు వుంది. దానివల్ల మనిషికి అపాయం జరుగకుండా వుంది. 

Thursday, 30 January 2014

USE FISH OIL FOR BETTER MEMORY


చేప నూనెతో మెదడుకు చురుకు!

"జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలనుకుంటున్నారా? అయితే చేపలు బాగా తినండి. చేపనూనె వల్ల మెదడు పరిమాణం పెరుగుతుంది. అల్జీమర్స్ లాంటి వ్యాధులూ దరిచేరవు. వయసు పైబడిన తరువాత ఒకటి నుంచి రెండేళ్ల పాటు మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో చేపనూనె ప్రభావం ఉంటుంది. ఇందులో ఉండే ఒమెగా- 3 కొవ్వు ఆమ్లాలు అందుకు తోడ్పడతాయి'' అని పరిశోధనల్లో వెల్లడైంది అంటున్నాడు జేమ్స్. ఈయన వాషింగ్టన్‌లోని సౌత్ డకోటా విశ్వవిద్యాలయ పరిశోధకుడు.

Tuesday, 14 January 2014

HEALTHY ADVANTAGES OF EATING REGI PANDU - REGI FRUIT


రేగుపండులో సుగుణాలు

రేగు పండులో విటమిన్ డి, ఎ, కె పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేగు పండు మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల రకాల రేగు పండ్లు లభిస్తున్నాయి. ఎండిన రేగు పండులో కాపర్, బోరాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాలు ఆస్టియోపొరోసిస్ నివారణలో ప్రధానపాత్ర వహిస్తాయి. రేగు పండు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మినరల్స్ బీపిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది. మంచి యాంటిఆక్సిడెంట్ కూడా కావడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రేగు పండులో బీ కాంప్లెక్స్‌లోని నియాసిన్, విటమిన్ బి6, ఫినోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కార్బోహైవూడేట్లు, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాల జీర్ణక్షికియకు తోడ్పడుతాయి. 

గుండె ఆరోగ్యానికి - రేగు పండులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా నిరోధిస్తుంది. అందువల్ల బీపి అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె కొట్టుకునే విధానం కూడా స్థిరంగా ఉంటుంది. రేగు పండులోని సాలిబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండులోని అధిక పొటాషియం శరీర బరువును కూడా నియంవూతిస్తుంది.

కాన్సర్ ను నిరోధిస్తుంది - రేగు పండులోని బీటా కెరోటిన్ చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటి ఆరోగ్యానికి - ఆరోగ్యవంతమైన కళ్లకి విటమిన్ ఎ ఎంతో అవసరం. రేగుపండులో విటమిన్ ఎ తో పాటు జియాక్సిథిన్ అనే ఒక ఫైబర్ కూడా రెటినా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మలబద్దకానికి - ఎండిన రేగు పండును ప్రూనే అంటారు. జీర్ణక్షికియకు తోడ్పడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఉండే సార్బిటాల్, ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణక్షికియ సామర్థ్యం పెరిగి కడుపులో కదలికలు సరైనరీతిలో జరిగి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం రేగు పండు.

నిరోధక శక్తి పెంపొందించడానికి- రేగుపండు ద్వారా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

వృద్ధాప్యం వాయిదా -రేగు పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాలిక్ యాంటిఆక్సిడెంట్, లూటిన్, క్రిప్టోక్సాథిన్, జియాక్సిథిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ప్రతినిత్యం జరిగే ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి వీలుంటుంది.

Wednesday, 11 December 2013

ARTILCE ON HUMAN PART - NOSE AND ITS PROBLEMS - BRIEF DISCUSSION





''శరీర మాద్యం ఖలుధర్మ సాధనమ్‌''
''లోకమందు ఏ కార్యసాధనమునకైనను ముందుగా కావలసింది ఆరోగ్యం'' అన్నాడు మహాకవి కాళిదాసు తన కుమార సంభవంలో.
''ఆరోగ్యమే మహాభాగ్యం''అన్నది నానుడి. మంచి ఆరోగ్యం ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్లే అంటారు కూడా! అంటే-మంచి ఆరోగ్యవంతుడైన మనిషి మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను తన సొంతం చేసుకుంటాడు.
సామాన్య ఆరోగ్యవంతుడు కూడా తన జీవిత కాలంలో కనీసం మూడుసంవత్సరాల పాటు వ్యాధులతో బాధపడతాడని చెప్పవచ్చు. మనిషికి ప్రాణవాయువును అందిస్తూ మనిషిలోని మిగిలిన అన్ని అవయవాలకు, జవాన్నీ జీవాన్నీ అందించే అత్యద్భుత అవయవాల్లో అతిముఖ్యమైనవి ముక్కు నోరే! ఎందు కంటే-ఒక మనిషి మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా లేక అనారోగ్యాల బారిన పడాలన్నా ముక్కు'నోరే ప్రధాన భూమిక పోషిస్తాయి! అందుకే-మనిషికి వచ్చే జబ్బుల్లో కనీసం, 70%పైగా జబ్బులు ముక్కు' నోరు విషయంలో అలసత్వం, అశ్రద్ధ, అజాగ్రత్తల కారణంగానే వస్తుంటాయని వైద్యశాస్త్రం గుర్తించింది. మనం పీల్చేగాలి, మనం తీసుకునే ఆహారమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. వీటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా తద్వారా మిగిలిన అవయవాలకు జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందని అనుక్షణం గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం.
మనిషికి వచ్చేజబ్బులు సాధారణంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. ఇవి పుట్టుకతో వచ్చే జబ్బులు. వయసుతోబాటు వచ్చే జబ్బులు. అజాగ్రత్తలు లేదా ఇన్ఫెక్షన్స్‌ ప్రమాదాల కారణంగా వచ్చే జబ్బులు.
ఇక్కడే మనం ఓ ముఖ్య విషయం ప్రస్తావించు కోవాలి. ప్రతిమనిషికీ తనలోనే వ్యాధి నిరోధక శక్తి నిబిడీ కృతమై
ఉంటుంది.
మంచి ఆరోగ్యం ఉన్న మనిషికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువ వ్యాధులు వస్తాయని మనం గుర్తించాలి. ముఖ్యంగా-ముక్కు -గొంతు ఇబ్బందులుఉన్నవారిలో వైరస్‌, బాక్టీరియా క్రిములు త్వరితగతిన చొచ్చుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి! మనిషికి ప్రాణవాయువును అందిస్తూ అతను జీవించడానికి కారణమైన ప్రధాన అవయవమైన ముక్కుకు సంబంధించిన వ్యాధులు పలురకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే-
1. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
2. మెదడునుంచి కణితులు ముక్కుద్వారా బయటపడటం
3. ముక్కు చీలిక
4. ముక్కులో ఈగలార్వా అభివృద్ధి చెందటం
5. ముక్కులో వెంట్రుకలు-జిగురులాంటి పదార్థం తయారుకావడం
6.ముక్కునుంచి రక్తం కారడం
7. ముక్కులో కండరాలు పెరగడం
8. ముక్కులో కణితులు పెరగటం
9.సైనొసైటిస్‌
10. ముక్కు అలర్జీ మరియు వేసోమోటార్‌ రైనైటిస్‌.
11. ముక్కులో గడ్డలు
12. ముక్కుపైన గడ్డలు
13. ముక్కు క్యాన్సర్‌
14. నేనో ఫెరెంజియల్‌ ఏంజియో ఫైరోమా
15.చిన్న పిల్లల్లో ముక్కు వెనుక భాగాన లింఫ్‌ గ్రంథులు వాచడం వల్ల వచ్చే అడినాయిడ్స్‌.
16. ముక్కునుండి దుర్వాసన.
17. ముక్కులో పుండు.
18. ఒక ముక్కునుంచే రసికారడం.
19. ముక్కు నుంచి రక్తం, చీము కారడం.
20. బలపం, బఠానీలు, రబ్బరు, పెన్సిల్‌, స్పాంజి వంటివి ముక్కులో ఇరుక్కోవడం
21. ముక్కులో పేపరు, పుల్లలు ఉండిపోవడం
22. ముక్కులో రాళ్ళు తయారుకావడం
23. వాసన తెలియక పోవడం, గ్రహణ శక్తి తగ్గిపోవడం
24. ముక్కుతో మాట్లాడటం
25. మూసుకు పోయిన ముక్కు, గాలి పీల్చే నోరు.
26. ముక్కు కారడం (ఇది మెదడులో నీరేనేమో?)
27. కంట్లోనీరు-ముక్కులో జబ్బు
28. సైనస్‌ తలనొప్పి

29. ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల వచ్చే తలనొప్పి.
ముక్కు గురక
30. గురుక నోటి గురక
శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల వచ్చే గురక.
31. ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌
1.సాధారణ జలుబు
2. ముక్కుపైన పుళ్ళు పడటం.
3. దీర్ఘకాలికంగా ఉండే ముక్కువ్యాధులు
4. పొక్కులు కట్టే ముక్కు వ్యాధి (అట్రోఫిక్‌ రైనైటిస్‌)
32. ముక్కు ఎముక విరుగుట
33. వంకర ముక్కు.
34. ముక్కులో రక్తం గడ్డ.
(రక్తం గడ్డ చీము గడ్డగా మారడం)