పగటిపూట నీరు ఎలా తాగాలి?
మనం ఉదయం పూట తాగిన నీరు 10, 11 గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోయింది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగటి పూట అంటే, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నుంచి సాయంకాలం వెలుతురున్న వరకు తాగే నీటి విషయం. ఈ సమయంలో తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది.
పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే సవ్యంగా ఉపయోగపడతాయి.
మూడవ దఫా నీరు : రెండవ దఫా నీటిని తాగిన తర్వాత 25, 30 నిముషాలు గ్యాప్ ఇచ్చి మీరు ఏదన్నా టిఫిన్ తినవచ్చు లేదా తాగవచ్చు. టిఫిన్ తినేటపుడు నీటిని తాగవద్దు. టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత ఈ మూడవ దఫా నీటిని ఒకేసారి మాత్రం తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు అంచెలుగా తాగితే మంచిది. అంటే అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. మధ్నాహ్నం భోజనానికి అరగంట ముందు వరకు నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగరాదు. మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు.
నాల్గవ దఫా నీరు : మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2, 3 అంచెలుగా లీటరు నుంచి లీటరుంపావు వరకు నీటిని తాగవచ్చు ఇలా తాగిన నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 55, 60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4, 5 గంటలు దాటిన తర్వాత ఇక నీటిని తాగకుండా ఉంటే రాత్రికి మూత్రం సమస్య ఉండదు.
ఉదవ దఫా నీరు : ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైతే నాల్గవ దఫాలో నీరు తక్కువ తాగారో వారికి, బాగా ఎండలో చెమటలు పట్టే పనిచేసిన వారికి, యుక్తవయసులో ఉన్న వారికి, ఉదయం రెండవ విరేచనం సాఫీగా అవ్వని వారికి, మూడవ విరేచనం ప్రయత్నిద్దామనే వారికి మంచిది. పైన చెప్పిన వారు మాత్రం ముప్పావు లీటరు నుంచి లీటరు నీటి వరకు సాయంకాలం 6 గంటల సమయంలో తాగి విరేచనం అవ్వాలని ప్రయత్నిస్తే సరిపోతుంది. రాత్రిపూట నీటిని తాగనవసరం లేదు. ఎవరికన్నా రాత్రి 9. 10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు.
తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?
కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరుతుంది. ఆ యాసిడ్ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్కి నీరు కలిపితే గాఢత లేదా పవర్ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.
పేగులను ఎవరెవరు క్లీన్ చేసుకోవాలి?
పేగులను క్లీన్ చేయడానికి కొందరు మాత్రలు వాడితే, కొందరు ఆముదం, ఇంకొందరు ఉప్పు నీళ్లు తాగడం ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఆ మార్గాలన్నీ పేగులను కొంత శుభ్రం చే సినప్పటికీ శరీరానికి 1, 2 రోజుల్లోనే కొంత నీరసాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఆ మార్గాలు పేగులలో ఉన్న మలాన్ని పూర్తిగా శుభ్రం చేయలేవు. మనిషి ఏదో ఒక సమయంలో తను వాడుకునే అన్ని వస్తువులను, వాహనాలను పూర్తిగా శుభ్రం చేస్తూ ఉంటాడు. చివరకు 10, 12 సంవత్సరాల కొకసారైనా సెప్టిక్ ట్యాంకు కూడా పూర్తిగా శుభ్రం చేస్తారు. దానికున్న అదృష్టం కూడా మన పేగులకు ఈ రోజుకీ లేదు. దానినిండా తట్టెడు పేరుకున్నా మనకు పట్టడం లేదు. మలం పేగు ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దానిని బట్టే మనలో రోగనిరోధకశక్తి ఉంటుంది. పేగులను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ముందు వాటిలో ఉన్న చెత్తను పూర్తిగా క్లీన్ చేసి ఆ తర్వాత రోజూ సాఫీగా 2, 3 సార్లు విరేచనం అయితే ఇక ఎప్పటికీ వాటి ఆరోగ్యం చెడిపోదు. ఏ లక్షణాలు ఉన్న వారు క్లీన్ చేసుకోవాలో ఆలోచిద్దాం. నీళ్లు తాగి మనసు పెట్టి ప్రయత్నించినా విరేచనం కానివారు, ఒకవేళ అయినా ఎక్కువ సమయం పడుతున్నవారు, ఎక్కువ కాలం నుంచి బాగా మలబద్దకం ఉన్న వారు, విరేచనం బాగా పెంటికలుగా వచ్చేవారు, పేగుల్లో బంక బాగా ఉన్నవారు, ఎమీబియాసిస్, నులిపురుగులు, నలుగు పాములున్నవారు, గ్యాస్ట్రబుల్ బాగా ఎక్కువగా ఉన్న వారు, ఆకలి అసలు వేయని వారు, కడుపునొప్పి తరచుగా వచ్చేవారు, మలం బాగా దుర్వాసన ఉన్నవారు ముందుగా పేగులను శుభ్రం చేసుకుంటూ దానికి తోడుగా ఆహార నియమాలను, నీటి నియమాలను పాటించడం మంచిది.
మనం ఉదయం పూట తాగిన నీరు 10, 11 గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోయింది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగటి పూట అంటే, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నుంచి సాయంకాలం వెలుతురున్న వరకు తాగే నీటి విషయం. ఈ సమయంలో తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది.
పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే సవ్యంగా ఉపయోగపడతాయి.
మూడవ దఫా నీరు : రెండవ దఫా నీటిని తాగిన తర్వాత 25, 30 నిముషాలు గ్యాప్ ఇచ్చి మీరు ఏదన్నా టిఫిన్ తినవచ్చు లేదా తాగవచ్చు. టిఫిన్ తినేటపుడు నీటిని తాగవద్దు. టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత ఈ మూడవ దఫా నీటిని ఒకేసారి మాత్రం తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు అంచెలుగా తాగితే మంచిది. అంటే అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. మధ్నాహ్నం భోజనానికి అరగంట ముందు వరకు నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగరాదు. మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు.
నాల్గవ దఫా నీరు : మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2, 3 అంచెలుగా లీటరు నుంచి లీటరుంపావు వరకు నీటిని తాగవచ్చు ఇలా తాగిన నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 55, 60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4, 5 గంటలు దాటిన తర్వాత ఇక నీటిని తాగకుండా ఉంటే రాత్రికి మూత్రం సమస్య ఉండదు.
ఉదవ దఫా నీరు : ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైతే నాల్గవ దఫాలో నీరు తక్కువ తాగారో వారికి, బాగా ఎండలో చెమటలు పట్టే పనిచేసిన వారికి, యుక్తవయసులో ఉన్న వారికి, ఉదయం రెండవ విరేచనం సాఫీగా అవ్వని వారికి, మూడవ విరేచనం ప్రయత్నిద్దామనే వారికి మంచిది. పైన చెప్పిన వారు మాత్రం ముప్పావు లీటరు నుంచి లీటరు నీటి వరకు సాయంకాలం 6 గంటల సమయంలో తాగి విరేచనం అవ్వాలని ప్రయత్నిస్తే సరిపోతుంది. రాత్రిపూట నీటిని తాగనవసరం లేదు. ఎవరికన్నా రాత్రి 9. 10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు.
తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?
కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరుతుంది. ఆ యాసిడ్ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్కి నీరు కలిపితే గాఢత లేదా పవర్ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.
పేగులను ఎవరెవరు క్లీన్ చేసుకోవాలి?
పేగులను క్లీన్ చేయడానికి కొందరు మాత్రలు వాడితే, కొందరు ఆముదం, ఇంకొందరు ఉప్పు నీళ్లు తాగడం ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఆ మార్గాలన్నీ పేగులను కొంత శుభ్రం చే సినప్పటికీ శరీరానికి 1, 2 రోజుల్లోనే కొంత నీరసాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఆ మార్గాలు పేగులలో ఉన్న మలాన్ని పూర్తిగా శుభ్రం చేయలేవు. మనిషి ఏదో ఒక సమయంలో తను వాడుకునే అన్ని వస్తువులను, వాహనాలను పూర్తిగా శుభ్రం చేస్తూ ఉంటాడు. చివరకు 10, 12 సంవత్సరాల కొకసారైనా సెప్టిక్ ట్యాంకు కూడా పూర్తిగా శుభ్రం చేస్తారు. దానికున్న అదృష్టం కూడా మన పేగులకు ఈ రోజుకీ లేదు. దానినిండా తట్టెడు పేరుకున్నా మనకు పట్టడం లేదు. మలం పేగు ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దానిని బట్టే మనలో రోగనిరోధకశక్తి ఉంటుంది. పేగులను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ముందు వాటిలో ఉన్న చెత్తను పూర్తిగా క్లీన్ చేసి ఆ తర్వాత రోజూ సాఫీగా 2, 3 సార్లు విరేచనం అయితే ఇక ఎప్పటికీ వాటి ఆరోగ్యం చెడిపోదు. ఏ లక్షణాలు ఉన్న వారు క్లీన్ చేసుకోవాలో ఆలోచిద్దాం. నీళ్లు తాగి మనసు పెట్టి ప్రయత్నించినా విరేచనం కానివారు, ఒకవేళ అయినా ఎక్కువ సమయం పడుతున్నవారు, ఎక్కువ కాలం నుంచి బాగా మలబద్దకం ఉన్న వారు, విరేచనం బాగా పెంటికలుగా వచ్చేవారు, పేగుల్లో బంక బాగా ఉన్నవారు, ఎమీబియాసిస్, నులిపురుగులు, నలుగు పాములున్నవారు, గ్యాస్ట్రబుల్ బాగా ఎక్కువగా ఉన్న వారు, ఆకలి అసలు వేయని వారు, కడుపునొప్పి తరచుగా వచ్చేవారు, మలం బాగా దుర్వాసన ఉన్నవారు ముందుగా పేగులను శుభ్రం చేసుకుంటూ దానికి తోడుగా ఆహార నియమాలను, నీటి నియమాలను పాటించడం మంచిది.