WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Bhakthi Facts. Show all posts
Showing posts with label Bhakthi Facts. Show all posts

Friday, 5 February 2016

CRYSTAL TORTOISE / BRONZE TORTOISE STATUE FOR PUJA IN HOMES


తాబేలు ప్రతిమ ని ఇత్తడిలో గాని ,క్రిష్టల్ లో గాని తీసుకొని దానిని ఇత్తడి ప్లేట్ లో గాని,పింగాణి లేదా గాజు పాత్రలోగాని నీటిని పోసి తాబేల్ ని ప్లేట్ తో సహా ఉత్తరం దిక్కున ఉంచాలి.ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న నీటిని తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తరం దిక్కున ఉంచాలి.ప్లేట్ లో నీటిని పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికలను మనస్సులో తలచుకుంటు నీటిని పోయాలి.
తాబేలు నీటిలో ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది.కాబట్టి తాబేలుని నీటిలో ఉంచటం వలన తాబేలుకి సహజ వాతావరణంలో ఉంచాము అన్న అనుభూతి కలుగుతుంది.బ్రతికి ఉన్న తాబేలుని కూడ ఎక్వేరియంలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచవచ్చు
తాబేలు ని విష్ణు భగవానుడి స్వరూపంగా కొలుస్తారు.వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని ,ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు.జోతిష్యశాస్త్రం లో బుధగ్రహానికి అదిదేవుడు విష్ణు భగవానుడు. ఉపయోగాలు ;-
1) తాబేలుని నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహా దోషాలు తొలిగిపోతాయి.
2)తాబేలు ఉన్న ఇంటి లో పిల్లలు అందరు మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు.మంచి వాక్శుద్ది తో భావప్రకటన చేయగల సామర్ధ్యం కలిగి ఉంటారు.
3)తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతుంది.ఆ ఇంటిలో ఉన్న మనుషులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.
4)తాబేలు ఉన్న ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు.
5)తాబేలు షాపులలో ఉంచటం వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

Monday, 7 December 2015

GENERAL DEVOTIONAL FACTS IN TELUGU - MUST FOLLOW - KALASARPA DHOSHA NIVARANA ARTICLES


కాలసర్పదోషం వల్ల వచ్చే దోషాలు తగ్గడానికి రాగితో చేసిన సర్పం ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరించాలి. ప్రతి మంగళవారం పగలు పాలు, పండ్లు తీసుకుంటూ జంటనాగులకు పాలుపోసి, రాత్రికి భోజనం చేయవచ్చు.
గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది.
రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శనివారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమిస్తాయి.
ఇంటర్వ్యూల్లో విజయానికి, గురుబలం వృద్ధి చెందడానికి
చతురస్రాకారంలో ఉండే వెండి ముక్కను పసుపు గుడ్డలో చుట్టి, దగ్గర ఉంచుకోవాలి. దీని వల్ల గురుబలం వృద్ధి చేంది, ఇంటర్వ్యూల్లో విజయం లభిస్తుంది
సప్తాశ్వరథారూఢుడైన సూర్యుడు, ఇంకా విశేషంగా ద్వాదశాదిత్యుల చిత్రపటాన్ని తూర్పు దిక్కుగా ఉంచి, ఉదయం 6 నుంచి 7 లోపు సూర్యాష్టకాన్ని పఠించాలి. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగి, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. ఏలినాటి శని జరుగుతున్న వారు మాంసాహారాన్ని మానేసి, దీన్ని పాటించడం వల్ల శనిదోషం తగ్గుతుంది.
త్రిపుష్కర యోగం
మధ్యాహ్నం 1-47 నుంచి రోజంతా త్రిపుష్కర యోగం ఉంది. ఈ యోగం లో ఏం చేసినా, తిరిగి అదే జరుగుతుంది. అందుకే ఈ సమయంలో మంచి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి.
ఆకస్మికంగా ఆదాయం తగ్గుతుంటే ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, 5 వత్తులు వేసి, 5 ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలి.
తరచూ అనారోగ్యాలు కలుగుతుంటే రావి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.
పితృదేవతలు శాంతించేందుకు మేడి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.

Wednesday, 2 December 2015

INFORMATION ABOUT PUJA MANDIRAM IN HOUSES


పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి

శ్లో || ఆదిత్య గణనాథం చ దేవీం రుద్రం చ కేశవం | 

పంచదైవత్యమిత్యుక్తం సర్వకర్మసు పూజయేత్ || మన హిందూ సాంప్రదాయంలో కులాలకు అతీతంగా ఆస్తికులైన వారందరూ తమ పూజా మందిరాలలో ఐదుగురు (పంచదేవాతలు) విగ్రహాలను ఉంచి పూజించాలి. అవి సూర్యుడు, గణేశుడు, (దేవి) పార్వతి, శివుడు, విష్ణువు. వీరిని సమిష్టిగా పంచాయతన అని వ్యవహరిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించవచ్చు. మన హిందూ, సనాతన సాంప్రదాయ రీత్యా ఈ పంచాయచన పూజ ఎంతో శ్రేష్ఠమైనదిగా మహా ఋషులు తెలిపారు. సకల శుభకార్యాలలోనూ, ప్రతినిత్యం ఈ ఐదుగురు దేవతను పూజించటం ఆ గృహంలో నివశించేవారందరికీ శ్రేయస్సు చేకూరుతుంది. ఈ ఐదుగురు దేవతలా విగ్రహాలు, చిన్నవి మీ గుప్పిటలో సరిపోయే కొలత ఉన్నవి వీటిని ఒక పళ్ళెంలో వుంచుకుని పూర్వాభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టతో శుభ్రపరచాలి. సమయాభావం ఉన్నవారు కేవలం ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే ......
కేవలం పంచ ఉపచార పూజ ... దేవతల పేర్లు చెప్పి 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం సమర్పయామి అంటే చాలు. అయితే అన్నిటికంటె ముఖ్యంగా భగవంతుని పూజలో, ఉపచార సమర్పణలో అర్చనచేసే వ్యక్తి భక్తిశ్రద్ధలే గీటురాళ్ళు. అందుకే చివరగా శాస్త్రం "తత్ర భక్తి శ్రద్ధా గరీయసీ'' అంటుంది.

Monday, 30 November 2015

EATING FOOD FACTS ACCORDING TO HINDU CULTURE AND TRADITIONS


భోజన వేళలో శుభాశుభ శకునాలు

శుభం, అశుభం ఫలితాలు మనకు కలిగే

ముందు అనేక రకాలైన అనేక శకునాలు వాటి

గురించే ముందే సూచిస్తుంటాయి. అలాంటి

శకునాలు అనేకం వున్నాయి. 


భోజన సమయంలో ఎలాంటి శకునం, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందో తెలుసుకుందాం. భోజనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే మంచి
జరుగుతుంది.

పచ్చదనం, సమృద్ది కలుగుతుంది.

భోజనం చేసేటప్పుడు కాకి వచ్చి
తలపై కూర్చుంటే అశుభం. అలాగే కాకి భోజన
సమయంలో కుడిభుజంపై వాలితే కడుపులో
వికారం, ఎడమ భుజంపై వాలితే కులనాశకుడవటం
జరుగుతుందని సూచన.

భోజనం చేసే వేళలో కుక్క ఏడుపు వినిపిస్తే
అశుభసూచన. అలాగే అవి మొరుగుతే, ధాన్యం
దొంగతనం అవుతుందనటానికి సంకేతం.

ఏదైనా వివాదం భోజనం చేస్తున్నప్పు ప్రారంభమైనా అది
అశుభం. ఆ ఇంట్లో అన్నానికి కొరత
ఏర్పడుతుంది. తినేటప్పుడు ఏడుపు శబ్దం
వినిపిస్తే, విన్న వారికి ఆరోగ్యం దెబ్బ తింటుందని
సూచన.

రొట్టె ఎక్కువగా కాలి మాడిపోతే ఆహార నష్టం
జరుగుతుందని గ్రహించాలి.
ఆ సమయంలో పాము కనిపిస్తే అశుభంగా
పరిగణిస్తారు.

భోజన సమయంలో పాము కనిపిస్తే
భోజనంలో విషం కలిసిందన్న అనుమానానికి కారణం అని పండితుల అభిప్రాయం.

ఇవి భోజన వేళలో శకునాల వల్ల కలిగే, శుభ, అశుభ పరిణామాలు. శకునాలు మనకు సూచనలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు, అశుభ శకునాల
నుంచి పరిగ్రహించుకొనుటకు మార్గాలు కూడా
ఉంటాయి.

సూచనలుగా శకునాలను గ్రహించి
జాగ్రత్త వహించటం ఎంతైనా మేలు.

VIBHUDHI MAHATYAM - IMPORTANCE OF VIBHUDHI IN+ HINDU PUJA


విభూది మహత్యం 

మనుజుల లిఖితములను నుదుట రాసి బ్రహ్మ మమ్ములను సృష్టించెను.
దాని ఆధారముగా విష్ణువు పోషణ నియమకముల చేసెను.
తర్వాతి భాగమంతయు లయ కారక క్రియలకు అనుగ్రహ మీతడే ఈశ్వరుడు .
మనుజులకు లలాట లిఖితత్వం బులకు , విభూదులను బూసి ,
పైన రాసిన రాతల పరివేష్టితంబులను పాప ఖర్మలను, విముక్తి చేయు ,
అభిషేక ప్రియుడు యీతడు ...
మూడు రూపములు కలవాడు ముక్కంటి ,
త్రికాలములకు , కాలముల విభేదములుగా కనిపించు వాడు ఇతడు ..
త్రిశూల ధారి ,త్రినేత్ర స్వరూపుడితడు
త్రిపుండ్రములనే ధరింప చేసి తన ఆలయమున దర్శన మిచ్చి ,
సర్వ పాపంబుల ప్రక్షాళన చేయు విశ్వేశ్వరుడు యీతడు...
ఖర్మలన్నింటిని అగ్ని తోడ శుద్ధి చేయగా మిగిలినది భస్మము..
ఆ భస్మ లేపనములే తాను బుచ్చి మారని వర్చస్సుని ..
సృష్టించిన వాడు లయకారుడు ఈతడే ...
వారి యొక్క పరివేష్టిత విభూదులే లోక సంరక్షణలే గంగ,పార్వతీ ప్రదాయుడై ,
అలరారు వారు శైవ క్షేత్రవాసులు ...
జలముల భస్మమును గల్పి తనని అభిషేకము చేసి అది మారు తీర్ధముగా బుచ్చినన్
వ్యాధి,అపమృత్యు దోషం,అరిషడ్వర్గం ,సర్వ ఇంద్రియ ప్రకోపములను ,
పరిమార్చగలిగిన శక్తి భస్మంబుదే..
మోక్ష యోగంబులకు విభూది ధారణ మహత్తర ..యోగంబే ...
నిరాడంబర సంబరములు ఇచ్చు విభూది తీర్థంబు ఇదే
ఆ మహేశ్వర తత్వమే ఇది........... ...శ్రీమాత్రే నమః....

DAILY MORAL RULES TO FOLLOW BY EVERYONE



పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం.

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు.

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

Saturday, 28 November 2015

PEACE WITH PUJA - TRADITIONS AND CULTURE


మన మనస్సు చంచల స్వభావం కలిగినది. సర్వకాల సర్వావస్థలయందును ఏదో ఒక విషయముపై చింతించుచునే యుండును. ఒక్క క్షణమైననూ తీరిగ్గా యుండదు. ఒక విషయము నుండి మరొక విషయమునకు త్వర త్వరగా మారిపోవుచుండును. లోకంలో మనోవేగానికి మించిన వేగము మరియొకటి లేదు. ఇటువంటి మనస్సును యధేచ్చగా విడిచినచో, ఇంద్రియములకు అధీనమై, కామక్రోధాదులను బలపరచి అహంకార మమకారములను వృద్ధి చేసి, మనల్ని పాపపు దారిలో నడిపించి అధోగతి పాలు చేస్తుంది.
మనస్సు బహు చంచలమైనది అగుట చేత ఏ విషయమునందును స్థిరముగా నిలువక సంచరించుచుండును. అట్టి చంచల చిత్త అయిన మనస్సును విషయ లోలత్వమునుండి మరల్చి ఆత్మయందే స్థాపితము చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయవలెనని భగవద్గీతలో చెప్పబడింది. గొప్ప ఆకర్షణలు మనల్ని లోబరచుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మనం ఏం చెయ్యలో ఆలోచించుకోవాలి. ఆ సమయంలో మీ ఆలోచనలను మంచివాటిమీదకి మెచ్చదగిన విషయాలమీదకి మళ్లించండి. మీ మంచి ఆలోచనలు మీ హృదయాలను నింపివేసినపుడు అవి ఆకర్షణలను, దుష్ట సంకల్పాలను దూరంగా తరిమివేస్తాయి. పెద్దవైనా, చిన్నవైనా అన్ని రకాల ఆకర్షణలకూ తిరుగులేని మందు ఏమిటంటే, మీ హృదయాన్ని తెరచి వుంచి, దాని సూచనలను, భావాలను, అనురాగాలను మీ గురుదేవులకు నివేదించండి. నిరంతరం భగవంతుణ్ణి నామజపం చేస్తూ వుంటే, ఊపిరితీయడంలోనూ, వదలడంలోనూ ఆయన పేరునే తలుస్తూ వుంటే అపుడు ప్రతికూలమైన ఆలోచనలు రావటానికి అవకాశం ఉండదు. ఇటువంటి ప్రతికూలమైన స్వభావాలను నిరంతరం ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ వాటికి మద్దతు ఇవ్వరాదు.
మనస్సు మీద నిరంతరం నిఘా వేసి ఉంచాలి. ఎటువంటి అనవసరపు ఆలోచనలు, ఆకర్షణలు లోనికి చేరకుండా చూసుకోవడం మంచిది. అవి ఎపుడు లోనికి చొరబడాలని చూసినా వెంటనే భగవంతుని వైపు తిరిగి మనఃపూర్వకంగా ప్రార్థించండి. అలా చేయడంవల్ల మనస్సు పవిత్రమవుతుంది.
మనస్సు మలినమైనచో స్థిరత్వము ఉండదు. మలినమైన మనస్సు చంచలత్వమునకు లోనై ఉన్న కారణంగా ఆత్మావలోకనం సిద్ధించదు. మనస్సు చంచల స్వభావము కలిగియున్న కారణంగా స్థిరత్వమును కోల్పోయి వివేచనాశక్తిని, ధారణ శక్తిని కోల్పోయి ఆధ్యాత్మిక చింతనకు దూరమైపోతుంది. అందువల్ల మనం సరైన పద్ధతిలో ఆధ్యాత్మిక చింతనను చేయలేము. అందుకే మనం మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి.
సర్వఅవస్థల యందును, సర్వకాలములయందును ‘మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణము ఉత్తమమైనది అని వ్యాస భగవానుడు చెప్పియున్నారు. మనస్సును జయించినవాడు ముల్లోకములను జయించవచ్చును. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనునవి మానవుని మనఃశాంతికి బద్దశత్రువులు. ఈ శత్రువులు మన భౌతిక, మానసిక శక్తులను క్షీణింపజేస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటానికి తప్పనిసరిగా అరిషడ్వర్గములను జయించాలి. మనిషి ప్రాపంచిక సుఖాలకు లోబడి సహజ స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుంటున్నాడు. తనలోని సద్గుణాలను పోగొట్టుకుని దుఃఖానికి ప్రబల కారణమైన కోరికలకు బానిస అవుతున్నాడు. కోరికలకు బానిస కాకుండా నిరంతరమైన అభ్యాసంతో మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి. మనస్సును పవిత్రమైన ఆలోచనలతో నింపితే చివరికి ఆ పవిత్రమైన ఆలోచనలు మాత్రమే మనలోనుంచి బయటకు వస్తాయి. అపుడు మనస్సు శుభ్రపడుతుంది.
మితాహారము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మములను సక్రమంగా నిర్వర్తించుటవల్లనూ, ఉపవాస, వౌనవ్రత దీక్షలు జరుపుటవల్ల సాత్వికాహారం భుజించటంవల్ల మనం తప్పనిసరిగా మనస్సును నిగ్రహించుకోవచ్చును.

KNOW ABOUT GOD - HINDU PURANA ARTICLE ABOUT PRAYING GOD


కేవలం ఆరుశ్లోకాలల్లోనే భగవం తుని గూర్చి తెలుసుకొంటూ భగవం తుని శరణాగతిని పొందవచ్చని ఆదిశంకరులు మనుషులకు ఇచ్చిన బహుమతిగా షట్పదిస్తోత్రాన్ని భక్తుల భావిస్తారు... ఆ సాహితీ కుసుమం లోని పూలపరిమణం ఇదే ఓ భక్తుడు తన మనసులోని విషయాన్నంతా తనకు ఆప్తుడు, మిత్రుడు, అంతేకాదు తన సర్వస్వము అయన భగవంతునికి తనకు కావాల్సినదాన్నంతా నివే దిస్తున్నాడు. ముందు తనలో ఉండకూడని విషయాలను చెబుతూ తనకు కావల్సిన వాటిని అనుగ్రహించమని కోరుకుం టున్నాడు.
అవినయ మపనయ.......
నాలో ఉన్న అవినయాన్ని తొలగించి సంసార సాగరంలో ఈదులాడే నాకు, వినయాన్ని అలవడే విధంగా మనో నిగ్రహాన్ని కలిగించే శక్తినిమ్ము . ఆపై ఎండమావులవంటి విషయ వాంఛలకు లోనుకాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి తగిన శక్తి సామర్ధ్యాలను సమకూర్చమని మొదటి శ్లోకంలో కోరుకుంటాడు. ఆ తరువాత రెండవ శ్లోకంలో
దివ్యధునీ మకరందే..................
శ్రీపతి పదారవిందముల సేవనమంటేదుఃఖభాజనమైన ఈ జీవిత నౌకను తీరం చేర్చేందుకు అనువైన తాడు శ్రీపతి పదారవిందములే. అంతే కాక అభీష్టసిద్ధినిసిద్ధింపచేసేవీ ఈ పాదాలేనని భగవం తుని కీర్తిస్తాడు.
సత్యపి భేదాపగమే నాథ ... ఇందులో భగవంతుడే తన నాథుడనుకొనే భక్తుడు సర్వానికి మూలమూ భగవంతుడే నం టాడు. నేను బీజ ప్రాయుడనని, నీవో వృక్షప్రాయుడవని భావిస్తూ భక్తుడు తన అల్పత్వాన్ని ఆపాదించుకొంటాడు. అట్లానే నేను ఓ తరంగాన్ని అయతే నీవో సముద్రమంటివాడివని (్భగవంతుడు) అట్లాంటి నీతో నాకు పోలిక యేమిటి యని భగవంతుని సామర్ధ్యాన్ని శ్లాఘిస్తారు. ఇచట ద్వైత, అద్వైతతత్త్వానికి చక్కని సమ్మేళనమా అనిపిస్తుంది. అంటే ఇక్కడ దృష్టి భేదమేకాని తత్త్వ భేదము లేదుఅని భక్తుడు చెప్తాడు.
ఉద్ధృతనగ! నగభిదనుజ! ......... భగవంతునిపై విశ్వాసంతో లోకాలన్నిటికి కాపాడేవాడవు నీవే నంటూ సజ్జనమిత్రుడవు శిష్టులను కాపాడడమెంత ముఖ్యమో దుష్టులను దునుమాడడం కూడా నీవే అంతే శ్రద్ధతో చేస్తావు అంటాడు. అంటే ఇక్కడ పూర్వంలో భగవంతుడు చేసిన దుష్టులను దూరం చేయడంలో వారి కోరికలను ఎలా తీర్చాడో ఒక్కసారి భక్తుడు గుర్తు చేసుకొన్నట్టు అంత ర్లీనంగా కనిపిస్తుంది. ఇది భగవంతుని సర్వజ్ఞత్వాన్ని సూచిస్తుంది. భక్తజన హృదయాస్థితుడైన భగవంతుడే ముక్తిని ప్రసాదించే కరుణామూర్తి అనే నమ్మకం.
మత్స్యాదిభి రవతారై రవతారవతా.... అన్యధా శరణం నాస్తి. ఆత్మనివేదన అభివ్యక్తి. శరణాగతి తత్త్వంఇక్కడ ప్రకాశమా నమవుతుంది.
దామోదర! గుణమందిర! సుందర వదనారవింద! ........... భగవంతుని ఘటనా ఘట సమర్ధతను మెచ్చుకుం టూ భగవంతుడే శరణమని నీవే నన్ను కాపాడాలని కోరుకొం టాడు భక్తుడు.
కేవలం ఆరు శ్లోకాలతో ఉన్న ఈ షట్పది మనిషిలోని దుష్టఆలోచనలను దూరం చేస్తూ భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆరుశ్లోకాలను పఠించడం అంటే భక్తులు అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవడమే నంటారు.

Monday, 15 September 2014

LINGABHISHEKHAM TO LORD MAHADEV - WHY





శివునికి మాత్రమే అభిషేకం చేస్తారు ఎందుకని?

అభిషేకమంటే శివునికి అమావాస్య పూర్వకంగా నమక, 

చమక, పురుషసూక్త మంత్రాలతో చేసేది. శివుడు అభిషేక ప్రియుడు. 

ఆయనకు ఏకాదశ (పదకొండు సార్లు నమకం చెబుతూ) రుద్రాభిషేకం చేస్తారు. 

పదకొండుసార్లు కుదరకపోతే ఏకవారం చేయవచ్చు. శివునికి చేసేదే అభిషేకం. 

మిగిలిన దేవీదేవతలకు మంత్రపూతంగా స్నానం చేయించడం జరుగుతుంది. 

ఆయా దేవతలకు చేసే పదహారు రకాల ఉపచారాలలో స్నానం కూడా ఒకటి.

WITHOUT MANGO LEAVES - THERE IS NO TRADITIONAL OCCASION WILL BE PERFORMED IN INDIA - WHY



మామిడాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.. ఎందుకని?

ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది. మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే.

పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది. మామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు. క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది.

Saturday, 26 July 2014

ARTICLE IN TELUGU ON SRAVANA MASAM - THE IMPORTANCE OF SRAVANA MASAM AND ITS PUJA PRAYERS


శ్రావణ మాసం విశిష్టత ,
(27 నుంచి శ్రావణమాసం ప్రారంభం )

మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు .

శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి.

ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు .

మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే .

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,
భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది


. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.

Wednesday, 28 May 2014

WHAT IS THE SECRET BEHIND GOD PUJA WITH FLOWERS AND TAKING PRASADAMS AFTER PUJA



దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం

1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.

3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.

4. రుద్రాక్షపూవును అర్పిస్తే - ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.

5. మొగలిపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.

6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.

7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.

8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.

10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.

11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.

12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.

13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.

14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.

15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.

16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.

17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.

18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. 
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.

20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి