WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 8 September 2014

ARTICLE ABOUT SRI PADMANABHA SWAMY TEMPLE AT AHOBILAM - ANDHRA PRADESH - INDIA


ఆంధ్ర పద్మనాభుడు ( అహోబిలం )

ప్రతి భారతీయుడు నోట్లో నానుతూ, సంభ్రమాశ్చర్యాలను కలిగించిన విషయం కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో బయట పడిన సంపద. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా వందల సంవత్సరాలుగా ఎటువంటి భద్రతా లేకుండా బయట పడిన లక్షల కోట్ల నిధి – దేశ రాష్ట్రపతి నుంచి కేరళ పద్మనాభ స్వామి ఆలయం బయట బిక్షాటన చేసే సామాన్యుడి వరకూ తాము వింటున్నది, చూస్తున్నది కలా నిజమా అనే ఆలోచనలో పడేశాయి.
ఇదే సమయంలో ఈ నిధులు బయటపడటం దేశంలోని అనేక పురాతన ఆలయాలపై అధికారుల దృష్టి మరల్చాయి. ఈ అంశంపై అధికారులు చరిత్రకారుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాలలో కూడా ఇటువంటి గుప్త నిధులు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని అహోబిలం, శ్రీశైలం, మహానంది వంటి ప్రదేశాలలో ఆసియా ఖండంలోనే అతి పొడవైన భూగర్భ గుహలు ఉన్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని అనేక పురాతన ఆలయాలలో దాచిన నిధులకోసం దుండగుల బారిన పది అనేక పురాతన మందిరాలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పటికీ నల్లమల అటవీప్రాంతంలో అపార సంపద భూగర్భంలో నిక్షిప్తమై ఉందని చరిత్రకాలుల అభిప్రాయం. ఇటువంటి ఆలయాలలో అహోబిలంలో నరసింహ క్షేత్రం ఒకటి.
ఈ రెండు చోట్ల రెండున్నర దశాబ్దాల క్రితం భూగర్భంలోని నిధులను బయటకు తీసే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అను కోకుండా ఎదురైన అవాంతరాల ప్రభావమో లేక భగవంతుని ఆగ్ర హమో తెలియదు కానీ ఒకచోట తవ్వకాలకు పాల్పడిన వ్యక్తి జైలు పాలైతే, మరోచోట ప్రయత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హైకోర్టును ఆశ్రయించి అహోబిలంలో తవ్వకాలకు 1986లోనే అను మతులు సంపాదించిన నాగరాజు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, వీర భద్రాలయం వద్ద నిధులను బయటకు తీసేందుకు ప్రయత్నించిన నారా యణాచార్యులు అనేక ఇబ్బందులు పడ్డారని చెబుతున్నారు. వీరి అంచ నాలతోపాటు చరిత్రకారుల లెక్కల ఆధారంగా అహోబిలంలో టన్నుల కొద్దీ బంగారం ఉందంటున్నారు. దీని విలువ 5లక్షల కోట్ల రూపాయల పై మాటేనని కూడా చెబుతున్నారు. ఇక్కడ ‘అనంత’ సంపదను మించే ఉంటుందని అంటున్నారు. ఇక వీరభద్రస్వామి కొలువై ఉన్న నాగలూటి ఆలయంలో మన రాష్ట్ర బడ్జెట్‌కు రెండింతలుగా నిధి నిక్షేపాలున్నా యంటున్నారు. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయని వాదించే వారుండడం విశేషం.
హిరణ్యకశపున్ని సంహరించిన నరసింహస్వామి బలాన్ని చూసి దేవ తలు ‘ఆహాబల’ అన్న ప్రదేశం ఇప్పుడు అహోబిలంగా మారింది. కృత యుగంలో స్వామి ఇక్కడ అవతారం ఎత్తాడని చెబుతారు. నరసింహ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శించుకున్నారని చరిత్ర చెబుతోంది. కలియుగంలో వెంక టేశ్వరస్వామి కూడా స్వామివారిని దర్శించుకు న్నట్లు చారిత్రక సాక్ష్యా లున్నాయి. ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు, ఆదిశంకరులు, మద్వాచార్యులు, రామానుజాచా ర్యులతోపాటు శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసింహస్వామి ఆలయాన్ని తరచు దర్శించుకునేవారని చరిత్ర చెబుతోంది. 6వ శతాబ్దంలో అహోబిల ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తోండగా, 1398వ సంవత్సరం నవంబర్‌ నెలలో అహోబిల పీఠం ఏర్పాటైంది.
ఆలయం ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్నా పీఠం ఏర్పాటులో తమిళులు కీలకపాత్ర పోషించడంతో అది ఇప్పటికీ వారి అధీనంలోనే ఉంది. ఈ పీఠానికి 6వ పీఠాధిపతిగా పని చేసిన షష్ట పరాంకుశ మహాదేశికన్‌ 1513 సంవత్సరం ఫిబ్రవరిలో ఆలయ ప్రాంగంలోనే జీవసమాధి అయ్యారు. ఆ సమయంలో ఆల యానికి చెందిన సంపద నంతా తనతో పాటే ఆయన తన సమాధిలోకి తీసుకెళ్లారని చరిత్ర చెబు తోంది. పరాంకుశ మహాదేశికన్‌ ఎగువ అహోబిలంలోని నరసింహ స్వామి ఆలయ గర్భగుడికి ముందున్న ప్రాం తంలోనే సమాధి చెం దారు. ఇప్పటికీ అక్కడ ఇందుకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. సమాధిపై ఎలాంటి కట్టడాలు లేకపోయినా ఆ ప్రదేశంపై అడుగు పడ కుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లున్నాయి. ఇక్కడే అంతులేని సంపద పరాంకుశ మహాదేశికన్‌ సమాధిలో ఉందని భావిస్తున్నారు.
దీన్ని తవ్వేందుకు 1986లో కోలార్‌కు చెందిన నాగ రాజు తీవ్రంగా ప్రయ త్నించారు. ఈ నేలమాళిగను తెరిచేందుకు ఆయన హైకోర్టు అనుమతి కూడా తెచ్చుకున్నారు. అపారసంపదను బయటకు తీసేందుకు అవ సరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని కోలార్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఇప్పటి డిజిపి దినేష్‌రెడ్డి ఉండడం విశేషం. నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నరసింహ స్వామి ఆగ్రహ ఫలితమేనని భావించిన మిగిలిన వారు తవ్వకాలను మొదలుపెట్టకుండానే వెను తిరిగారు. అయితే, జీవసమాధి అయినషష్ట పరాంకుశ మహాదేశికన్‌ అక్కడ ఇప్పటికీ జీవించే ఉన్నారని భావిస్తున్న భక్తులు ఆయన ఆత్మ భగ వంతునిలో లీనమైన మరు నిముషంలో నేల మాళిగ తెరుచుకుంటుం దని విశ్వసిస్తున్నారు.
అనంతపద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలను తెరిచే అంశంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు అహోబిలం స్వామి వారి సంపదపై కూడా ఆదేశాలిచ్చే అవకాశం ఉందంటున్న నేపధ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు అహోబిలం నేల మాళిగను తెరవాలని ఆదేశిస్తే అది జరుగు తుందా? జరిగితే ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడుతుందనేది అం దరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఇక నల్లమల అటవీ ప్రాంతంలో ఆత్మకూరుకు సమీపంలోని నాగ లూటిలో ఉన్న వీరభద్రస్వామి ఆల యంలోనూ అపార సంపద ఉందని అంటున్నారు


No comments:

Post a Comment