WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 9 September 2014

GAJENDRA MOKSHAM - BHAGAWATHAM PADYALU AND ITS MEANING


భాగవత పద్యాలు

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలసుధంబు దా,
పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో,
త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి,
హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై
వైకుంఠపురం . అందులో సరస్సు , సరస్సు పక్కనే మందారవనం . మందారవనంలో ఒక చలువరాతి మంటపం . అక్కడే కలువపూలు పరిచిన పర్యంకం . మందహాస వదనారవిందుడై పర్యంకం మీద పవళించి లక్ష్మీ మాతతో సరస సల్లాపాలలో మునిగి ఉన్నాడు మాధవుడు . అకస్మాత్తుగా వినిపించింది గజేంద్రుని ఆర్తనాదం . క్షణంపాటు తొట్రుపాటు పడ్డాడు . భక్తుడు కష్టాలలో చిక్కుకున్నాడన్న విషయం తెలిసింది . గజేంద్రుని కరుణించాలనే తపన తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు పరమాత్ముడు . ఇతరులకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినవాడు తానే ఇతర విషయాలన్నీ వదిలేసి ఉన్నపళంగా బయలు దేరాడు భక్తుని రక్షించడానికి . ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఇదే .
సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధితశ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై
సమయం లేదు . గజరాజును కాపాడలనే తపనలో లక్ష్మీ మాతకు కూడా ఎక్కడకు వెడుతున్నాడో చెప్పలేదు . శంఖచక్రాలూ , తనపరివారమూ , వాహనమైన గరుడుడూ జ్ఞాపకం రాలేదు . ఎంత తొందరంటే పట్టుకున్న లక్ష్మీ దేవి కొంగు విడవాలని కూడా అనిపించలేదు . మహావిష్ణువు మనః స్థితిని అందరికీ తెలిసిన పై పద్యం ద్వారా చెప్పాడు పోతనామాత్యుడు . బాగానే వుంది . తొందరపాటులో ఏం చేయలో నిర్ణయించుకోలేక పోతున్న విష్ణువును చూచి చలించి పోయింది క్షీరసముద్ర రాజ తనయ .విషయమేమో తెలియడం లేదు . తెలుసుకోవాలనే కోరిక . అడగాలంటే సంకోచం . మన గృహాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి . అప్పుడు భార్యలేం చేస్తారో తెలియదు కాని , మాత మాత్రం కింద చెప్పిన విధంగా ప్రవర్తించింది . మాత ఏం చేస్తోందో పద్యంలో మనకు తెలియ జేస్తున్నాడు మహానుభావుడు పోతన .
అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్
వెడ వెడ జిడి ముడి తడబడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్
” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో ఒక అడుగు ముందుకు జరిపింది . అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది . ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది . వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు పోతన్న . పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది . శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . అందుకే అన్నాడో కవి ” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలసుధంబు దా,
పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో,
త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి,
హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై
వైకుంఠపురం . అందులో సరస్సు , సరస్సు పక్కనే మందారవనం . మందారవనంలో ఒక చలువరాతి మంటపం . అక్కడే కలువపూలు పరిచిన పర్యంకం . మందహాస వదనారవిందుడై పర్యంకం మీద పవళించి లక్ష్మీ మాతతో సరస సల్లాపాలలో మునిగి ఉన్నాడు మాధవుడు . అకస్మాత్తుగా వినిపించింది గజేంద్రుని ఆర్తనాదం . క్షణంపాటు తొట్రుపాటు పడ్డాడు . భక్తుడు కష్టాలలో చిక్కుకున్నాడన్న విషయం తెలిసింది . గజేంద్రుని కరుణించాలనే తపన తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు పరమాత్ముడు . ఇతరులకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినవాడు తానే ఇతర విషయాలన్నీ వదిలేసి ఉన్నపళంగా బయలు దేరాడు భక్తుని రక్షించడానికి . ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఇదే .
సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధితశ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై
సమయం లేదు . గజరాజును కాపాడలనే తపనలో లక్ష్మీ మాతకు కూడా ఎక్కడకు వెడుతున్నాడో చెప్పలేదు . శంఖచక్రాలూ , తనపరివారమూ , వాహనమైన గరుడుడూ జ్ఞాపకం రాలేదు . ఎంత తొందరంటే పట్టుకున్న లక్ష్మీ దేవి కొంగు విడవాలని కూడా అనిపించలేదు . మహావిష్ణువు మనః స్థితిని అందరికీ తెలిసిన పై పద్యం ద్వారా చెప్పాడు పోతనామాత్యుడు . బాగానే వుంది . తొందరపాటులో ఏం చేయలో నిర్ణయించుకోలేక పోతున్న విష్ణువును చూచి చలించి పోయింది క్షీరసముద్ర రాజ తనయ .విషయమేమో తెలియడం లేదు . తెలుసుకోవాలనే కోరిక . అడగాలంటే సంకోచం . మన గృహాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి . అప్పుడు భార్యలేం చేస్తారో తెలియదు కాని , మాత మాత్రం కింద చెప్పిన విధంగా ప్రవర్తించింది . మాత ఏం చేస్తోందో పద్యంలో మనకు తెలియ జేస్తున్నాడు మహానుభావుడు పోతన .
అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్
వెడ వెడ జిడి ముడి తడబడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్
” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో ఒక అడుగు ముందుకు జరిపింది . అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది . ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది . వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు పోతన్న . పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది . శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . అందుకే అన్నాడో కవి ” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .

No comments:

Post a Comment