WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 10 November 2015

DETAILED ARTICLE ABOUT FAMOUS NANDI HILLS OR NANDIDURG IN KARNATAKA STATE - INDIA



Nandi Hills or Nandidurg is an ancient hill fortress in southern India, in the Chikkaballapur district of Karnataka state. It is 10 km from Chickballapur town and approximately 60 km from the city of Bengaluru.

నంది హిల్‌‌స లేదా నంది దుర్గం దక్షిణ భారత దేశం లో ఒక పురాతనమైన ఎత్తన దుర్గం. ఇది కర్ణాటక రాష్టమ్రు లోని చిక్కబాల్లాపూర్‌ జిల్లాలో వుంది. ఇది చిక్కబలాపూర్‌ పట్టణం నుంచి కేవలం 10 కి.మీ మరియు బెంగళూర్‌ నగరం నుండి 60 కి.మీ దూరంలో వుంది. ఈ కొండలు నంది,ముద్దేనహళ్లి , కనివేనారయనపుర గ్రామాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ కొండల నుండి అర్కావతి అనే నది పుట్టింది. 

ఈ నంది కొండలు అనే పేరు ఎలా వచ్చింది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళుల కాలం లో దీన్ని ఆనంద గిరి అని పిలిచే వాళ్ళు. యోగి నందీశ్వరుడు ఇక్కడ తన ప్రాణాన్ని బలి ఇచ్చాడని అందువలననే ఈ కొండలకి ఆ పేరు వచ్చిందని ఇక్కడి ప్రజల నమ్మకం. నంది ని సాదారణం గా నంది దుర్గం (కోట) అని కూడా పిలుస్తారు. దీన్ని టిప్పూ సుల్తాన్‌ కట్టించాడు. కొందరు ఈ కొండలు నిద్రిస్తున్న నంది ఆకారంలో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెపుతారు. ఇది సముద్ర మట్టం నుంచి 4,551 అడుగుల ఎత్తు లో వుంది. ఇది జాతీయ రహదారి -7 వద్ద దేవనహళ్లి నుంచి 20 కి.మీ వుంది. బెంగుళూరు విమానాశ్రయం కి అతి దగ్గరగా వున్నప్రదేశం. ఇక్కడి వాతావరణం ఊటి వలె చాలా చల్లగా వుండి హిల్‌‌ల స్టేషన్‌ ని తలపిస్తుంది. టూరిస్‌‌ట లకు చాలా ఆకట్టుకుంటుంది.

ముఖ్యమైన ప్రదేశాలు: 
టిప్పూ డ్రాప్‌ ఇక్కడి నుంచి బ్రిటిష్‌ ఖైదిలని కొండ మీద నుంచి త్రోసివేయడం వల్ల ఇది చాలా ప్రసిద్ది చెందింది.

టిప్పూ వేసవి విడిది: 
ఇది టిప్పూ సుల్తాన్‌ గెస్‌‌ట హౌస్‌. వేసవిలో ఇక్కడే వుండేవాడు. దీనిని చిక్కబల్లాపూర్‌ సామంత రాజులు కట్టించారు. టిప్పూ సుల్తాన్‌ దీన్ని శత్రు దుర్భేద్యమైన కోటగా తయారు చేశాడు. దీనిలోకి ఇప్పుడు మూసివేసారు. సందర్శకులు కేవలం బయటినుండి మాత్రమే చూడవచ్చు.

రహస్య సొరంగం: 
ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకునేందుకు పశ్చిమ వైపు ఒక రహస్యపు దారి వుంది.

దేవాలయాలు: 
ఇక్కడ శ్రీ భోగ నరసింహా, శ్రీ ఉగ్రనరసింహ మరియు శ్రీ యోగ నరసింహ అంకితమైన అనే చాలా అందమైన పురాతనమైన గుడి ఉంది.

గవి వీరభద్ర స్వామి గుడి: 
కొండ పైభాగాన గవి వీర భద్ర స్వామి టెంపుల్‌ వుంది
ఇవి మాత్రమే కాకుండా నెహ్రు నిలయ గెస్‌‌ట హౌస్‌, గాంధీ గెస్‌‌ట హౌస్‌, పిల్లల ఆట స్థలం ఉన్నాయి.

ప్రకృతి శోయగాలు: 
కర్నాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్‌ జిల్లాలో అతి ప్రాచీన పర్వత కోట. దీనిని నందిదుర్గ అని కూడా అంటారు. బెంగుళూరుకి సుమారుగా 60 కి.మీల దూరంలో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకి కనువిందు చేస్తుంది. ఈ కొండలు నంది, ముద్దెనహల్లి, కనివెనారాయణపుర నగరాల్ని కలుపుతూ విస్తరించి ఉన్న ప్రదేశం. ఈ ప్రాంతం గుండానే ఆర్కవతీ నది ప్రవహిస్తూవుంటుంది. ఈ నగరాలలో శ్రీ సత్య సాయిబాబా యూనివర్శిటీ, ఐఐటి ముద్దెనహల్లి, విశ్వేశ్వరాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్వాన్‌‌స్డ టెక్నాలజీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలకి నందిదుర్గ కేంద్రంగా ఉంది. ఇక చారిత్రక పరంగా ఈ నందిదుర్గకి చాలా కథనాలు ఉన్నాయి. చోళుల కాలంలో ఈ నందికొండల ప్రాంతాన్ని ఆనందగిరి అని పిలిచ ేవారు. అందుకు కారణం ఈ ప్రదేశం చాలా ఆనందాన్ని కలగ చేస్తుంది అనేది ఒక కథనమైతే, మరో కథనం ప్రకారం ఇక్కడ యోగి నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం కనుక ఆయన పేరుతోనే నందికొండలుగా ప్రసిద్ధి చెందింది అని అంటారు. అలాగే దీనికి నందిదుర్గ అనే మరోపేరుతో వ్యవహరిం చడానికి కారణం ఈ కొండపై ఉన్న కోట టిప్పూసుల్తాన్‌ నిర్మించాడు. అదీకాక ఈ కొండ పడుకున్న నంది ఆకారంలో ఉంటుంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక మరో కథనం ప్రకారం ఈ కొండమీద 1200 సంవత్సరాల క్రితం ద్రవిడ సంప్రదాయ వాస్తురీతిలో నందీశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ శివపార్వతుల దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలోని నందిని భోగనందీశ్వరుడని అంటారు. ఇక్కడ ఉన్న అందమైన సరస్సుని కళ్యాణీ చెరువు అంటారు.

నందిదుర్గ: 
దీనిని 19 డిశంబర్‌, 1791లో మైసూరుని పాలిస్తున్న టిప్పూసుల్తాన్‌ మొట్టమొదటి యుద్ధం సందర్భంగా ఈ ప్రాంతపు కార్నావాల్‌‌స సైన్యాలు నిర్మించారు. ఇక్కడ చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి.

టిప్పూసుల్తాన్‌ వేసవి విడిది: 
గంగ కాలంలో చిక్కబల్లాపూర్‌ సామంతరాజులు ఇక్కడ కోటని నిర్మించారు. ఆ తరువాత కాలంలో టిప దీనిని మరింత బలోపేతంగా మార్చడమే కాకుండా తన వేసవి విడిదిగా అన్ని సదుపాయాలతోటీ తీర్చిదిద్దాడు. నాటి నుంచి దీనిని టిప వేసవి విడిది అనే అంటున్నారు. ప్రస్తుతం దీని తలుపులు మూసేవుంటాయి. సామాన్య ప్రజలు లోపలికి అనుమతించరు.

గుర్రాల మార్గం: 
దీనిని హార్‌‌స వే అంటారు. కోటకి ఈశాన్య భాగంలో నాటి సైనికులు గుర్రాల మీద నుంచి ఎగబాకడానికి సహాయకారిగా ఉండటం కోసం నిర్మించినట్టు ఇక్కడివారి విశ్వాసం.

రహస్య మార్గం: 
ఈ దుర్గంలో శత్రువుల దాడినుండి రాజులు తప్పించుకోడానికి ఒక రహస్యమార్గాన్ని ఏర్పరిచారు. దీనిని చూస్తుంటే నాటి ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉండేదో అర్ధమవుతుంది. ఇక ఇక్కడ దేవాలయాలు భక్తికి, ఆధ్మాత్మికతకి నిలువుటద్దాలు. అందులో భోగనరసింహస్వామి ఆలయం, ఉగ్రనరసింహ దేవాలయం, యోగనరసింహ దేవాలయం లాంటివి మరెన్నో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

గవి వీరభద్రస్వామి దేవాలయం: 
శిఖరాగ్రాన సుల్తాన్‌ పేట వెళ్ళే మార్గంలో టిప్పూ సుల్తాన్‌ పేలస్‌ వద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద బండరాళ్ళతో నిర్మించిన దేవాలయం గవి వీరభద్ర ఆలయం. ఇది అనేక కళా నైపుణ్యాలతో అలరారుతూవుంది.

పిల్లల ఆట స్థలం: 
ఇది హార్టీ కల్చర్‌ శాఖవారు పిల్లలకోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న గార్డెన్‌. ఇందులో అనేక ఆట సదుపాయాలు సమకూర్చారు. ఇక్కడ ఎంతో వినోదంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటక ప్రదేశాలు నందికొండల చుట్టు పక్కల చూడదగ్గవి ఎన్నో వున్నాయి. ఇటువంటి ప్రదేశాలు తిలకించడం వల్ల విజ్ఞానం, వినోదంతో పాటు చారిత్రక కాలం నాటి స్థితిగతులు, జీవన విధానం మనకి తెలుస్తాయి.

ప్రశాంత వాతావరణం: 
నంది హిల్‌‌స అని బెంగళూరుకి 45 దూరం లోఉంది. అక్కడి టిప్పూ కోట లోకి వెళ్ళగానే ఒక చిన్న కొలను ఉంటుంది.. ఆ కొలను ఒంటరిగా బిక్కు బిక్కు మంతున్నట్టుగా ఉంటుంది. ఎవరు లేని ప్రదేశం అది.. ఏదో సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్‌ లాగా ప్రశాంతంగా ఉంటుంది.. అక్కడ ఉన్న వాతావరణం చూసి మనం ఎక్కడో సుదూర ప్రాంతం లోకి వెళ్ళినట్టుగా అనుకుంటాం.. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఎప్పటి నుంచి గూడు చేసుకున్న కోతులు కూడా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ హాయిగా ఆ ప్రకృతిని ఆరాధిస్తు్తన్నట్లుగా ఉంటాయి.

No comments:

Post a Comment