WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 29 July 2014

LORD SIVA TEMPLE AT YANAMADDURU VILLAGE - BHIMAVARAM - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA - MUST VISIT



యనమదుర్రు 'శక్తీశ్వరస్వామి క్షేత్రం'

యమధర్మ రాజుకు ఒకనాడు తాను చేసే విధిపై కొంచెం అసహ్యం కలిగి, శివుని గురించి తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించి ఒకానొక రాక్షసుని వధానంతరం నా దగ్గరకు రావడం జరుగుతుందని అప్పుడు తాను ఆంధ్రదేశంలో ప్రతిష్ఠించి, తద్వారా యముడు అంటే ప్రాణాలు తీసేవాడు కాదు, దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయగలడనే మంచి పేరు దక్కేలా చేయడమే కాక మనుష్యులందరి చేత స్మరింపబడతాడని యమధర్మరాజుకి వరం ఇచ్చాడు. ఆ వరప్రభావంగా ఈ 'యనమదుర్రు' గ్రామం వెలిసింది. ఈ దేవస్థానంలో మహాశివుడు శీర్షాసన భంగిమలో వెలియడం విశేషం.


శివుని ప్రతిమ (సాకారరూపం) సాధారణంగా కాళ్లపై నిలబడి ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు శీర్షాసన (తలక్రిందులుగా తపం ఆచరిస్తున్న) భంగిమలో ఉండటం విశేషం. శివుడి జటాఝూటం భూమిని తగులుతూంటుంది. ఆపైన ముఖం, కంఠం, ఉదరం...ఇలా ఆఖరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి. బాలింతగా తాను కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణ ధ్వేయంగా అమ్మవారు తన ఒడిలో మూడునెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలిసి, భక్తులను అనుగ్రహిస్తోంది.

దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీపార్వతీ సమేత శక్తీశ్వర స్వామి క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో గల యనమదుర్రు గ్రామంలో వుంది.

TELUGU CHILDREN'S STORY - HARIKATHA



హరికథ చేసిన మేలు

ఒక ఊరిలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. 

ఒకసారి వాళ్ళఊరి గుడిలో హరికథ చెబుతున్నారు.

ఆ సంగతి తెలుసుకొన్న రామయ్య, ఆ రాత్రికి గొర్రెల మందలోకి పనివాణ్ణి పంపి, తను హరికథ వినడానికి వెళ్ళాడు.


వెళ్ళేటప్పుడు, అతని భార్య అతనికి కొన్ని పప్పులు(పుట్నాలు) ఇచ్చి పంపింది. 

అయితే గొర్రెల్లో ఉండీ ఉండీ నోరాగకుండా తినటం అలవాటైంది రామయ్యకు. 
భార్య ఇచ్చిన పప్పులు కాసిన్నీ హరికథ చెప్పేచోటికి వెళ్ళేలోపే తినేసాడు అతను. 
తీరా గుడిని చేరుకొని చూస్తే, హరి కథ చెప్పే దాసుగారు ఇంకా రాలేదు. 
నోరాగని రామయ్య ఇక ఆగలేకపోయాడు. పప్పులకోసం తిరిగి ఇంటికి వెళ్లాడు. 
భార్య ఇంట్లో ఉన్న పప్పులన్నింటినీ బట్టలో కట్టి ఇచ్చింది రామయ్యకు. 
ఇక అతను సంతోషంగా వాటిని తినుకుంటూ హరికథకు వెళ్ళాడు. హరికథ మొదలయింది.


దాసుగారు "ఆఁ, అందరూ వచ్చారా? 
ఆఁ, అందరూ కూర్చోండి! సరే!! 

అయితే ఇక మొదలు పెడదామా?" అని అంటూండే లోపే, కడుపునిండా తిన్న రామయ్య నిద్రలోకి జారుకున్నాడు. హరికథంతా అయిపోయేసరికి అర్థ రాత్రయింది. అందరూ ఇళ్లకు వెళ్తుండగా మేలుకున్న రామయ్య, " ఆఁ, అందరూ వెళుతున్నారా?" అని హరికథ చెప్పే దాసుగారు అనటం మాత్రం విన్నాడు. ఇక తనూ లేచి, అందరితోపాటూ తీరికగా ఇంటికి చేరుకున్నాడు.


అప్పటికి సమయం ఒంటిగంటయ్యింది. సరిగ్గా అదే సమయానికి కొందరు దొంగలు రామయ్య ఇంటికి దొంగతనానికని వచ్చి ఉన్నారు.

ఇంటికెళ్ళిన రామయ్యను, హరి కథలో ఏమి చెప్పారని అడిగింది భార్య. అడగ్గానే, 
" ఆఁ, అందరూ వచ్చారా?" అనిగట్టిగా అన్నాడు రామయ్య.


అది విన్న పెరట్లోని దొంగలు తామొచ్చింది ఇంటిలోనివారికి తెలిసిపోయిందనుకొని, పొదలమాటున నక్కి కూర్చున్నారు.

ఈ సారి రామయ్య, " ఆఁ! అందరూ కూ
ర్చున్నారా?" అన్నాడు. తామొచ్చింది ఇంట్లోని వారికి ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్నారు బయటున్న దొంగలు!. 

ఈసారి రామయ్య "సరే! అయితే మొదలుపెడదామా! " అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇంట్లోని వారందరూ వస్తున్నట్టున్నారని దొంగలంతా పారిపోతుండగా, "ఆఁ! అందరూ వెళ్ళిపోతున్నారా?" అన్నాడు రామయ్య, దాసుగారు అన్నట్లుగా. దాంతో దొంగలు హడావిడిగా కాలికి బుద్ధి చెప్పారు. హరికథను వినకుండానే రామయ్యకు అంతమేలు జరిగింది,

FESTIVAL ARTICLES IN TELUGU - SRI MANGALA GOWRI VRATHA KATHA IN TELUGU - TIPS TO PERFORM SRI MANGALA GOWRI VRATHAM - STEP BY STEP DETAILS



శ్రీ మంగళ గౌరీ వ్రతకథ 


పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. 
కానీ, వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు.


ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం, వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు.

ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. 

కాబట్టి, శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

* మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. 

* మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. * వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.


ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ.

పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. 
ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను 
* గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. 
* రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. 

* మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు.


ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు.

తరువాత, వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యారు . 

ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.


మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి.

చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.