గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు
అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!
.
తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ
“ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు,
ఉదధి రాయంచ యూరక యుంట లెస్స,
సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు.
.
చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి ఎగతాళి మాటలకి
మౌనంగా ఉండటమే మంచిది. లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం.
.
గొప్పవారిని చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు’.
అని సుభాషిత రూపంలో ఉన్న ఈ చాటు పద్యం వివరిస్తుంది.
.
గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!
.
ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!
.
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకి శ్రేష్టమైన పద్మాల, ముత్యాల యొక్క విలువ తెలియదు. అందుకే అవి హంసని పరిహసిస్తాయి. ఇది పైపద్యభావం.ఇప్పుడు సంభాషణారూపంలో వివరణ------
కొంగలు— “ఎవరునువ్వు? నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?
హంస - ‘నేను హంసని!’
కొంగలు – “ ఎక్కడనుంచి వచ్చావు”?
హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”
కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?
హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులు, మంచి ముత్యాలు లభిస్తాయి!”
కొంగలు – ‘ నత్తలు ఉంటాయా’?
హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!
కొంగలు – “నత్తలు తెలియవా? అని పక,పకా నవ్వుతాయి”
అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!
.
తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ
“ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు,
ఉదధి రాయంచ యూరక యుంట లెస్స,
సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు.
.
చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి ఎగతాళి మాటలకి
మౌనంగా ఉండటమే మంచిది. లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం.
.
గొప్పవారిని చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు’.
అని సుభాషిత రూపంలో ఉన్న ఈ చాటు పద్యం వివరిస్తుంది.
.
గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు.!
.
ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!
.
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకి శ్రేష్టమైన పద్మాల, ముత్యాల యొక్క విలువ తెలియదు. అందుకే అవి హంసని పరిహసిస్తాయి. ఇది పైపద్యభావం.ఇప్పుడు సంభాషణారూపంలో వివరణ------
కొంగలు— “ఎవరునువ్వు? నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?
హంస - ‘నేను హంసని!’
కొంగలు – “ ఎక్కడనుంచి వచ్చావు”?
హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”
కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?
హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులు, మంచి ముత్యాలు లభిస్తాయి!”
కొంగలు – ‘ నత్తలు ఉంటాయా’?
హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!
కొంగలు – “నత్తలు తెలియవా? అని పక,పకా నవ్వుతాయి”
No comments:
Post a Comment