కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
.
ఓం నమఃశివాయ
"బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం"
.
ఓం నమఃశివాయ
"బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం"
కార్తీక పూర్ణిమనాడు ఆచరించాల్సిన మరో విధి - "భక్తేశ్వర వ్రతం".
పూర్వం మధుర ప్రాంతరాజు అయిన చంద్రపాండ్యుడికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి, ప్రత్యక్షమై -
"మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు గల కుమారుడు కావలెనో? లేక సంపుర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాల్నో కోరుకోమన్నాడు.
అందుకు - చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతులు కుమారుడినే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి పెరిగి పదహారు సంవత్సరాల వయస్సు వాడు అయ్యాడు. అయితే రాజదంపతులు కుమారుడిని మృత్యువు నుంచి కాపాడే మార్గం తెలియక చింతించసాగాడు. అనేక ఆలోచనలు చేసి మహాశివభక్తురాలిగా పేరుపొందిన అలకాపురి రాకుమార్తెను యిచ్చి వివాహం చేశారు. ఆమె భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకుని తన భర్తను కాపాడమని శివుడిని పూజించింది. వ్రతాలు చేసింది. చివరకు ఆయుష్షుముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమె భర్తను కాపాడమని కోరుతూ శివుడి వ్రతం చేసింది. శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడాడు. భక్తురాలి కోరికను తీర్చి భక్తేశ్వరుడైన శివుడి ప్రీత్యర్థం కార్తీక పూర్ణిమనాడు చేసే వ్రతమే "భక్తేశ్వర వ్రతం".
కార్తీక పూర్ణిమనాడు పగలంతా ఉపవాసం వుండి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళములతో పూజించి శక్తిమేరకు నైవేద్యము సమర్పించవలెను. ఈ విధంగా వ్రతం చేసినట్లయితే వైధవ్య బాధలుండవు. మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.
ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే దివ్యమైన రోజు "కార్తీక పూర్ణిమ"!
No comments:
Post a Comment