WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 13 November 2014

BHAKTHI YOGA - SRI BHAGAWADHGEETHA




భక్తియోగః 1( అథ ద్వాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత
అర్జున ఉవాచ:-
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే,
యే చాప్యక్షర మవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః‌.
అర్జునుడు చెప్పెను - ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మీయందే మనస్సును నెల్కొల్పినవారై ఏ భక్తులు మిమ్ముపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆయిరు తెగలవారిలో యోగమును బాగుగ నెరిగిన వారెవరు?.
******************************************************************************************* 1
శ్రీ భగవానువాచ:-
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే‌,
శ్రద్ధయా పరయోపేతా
స్తే మే యుక్తతమా మతాః.
శ్రీ భగవానుడు చెప్పెను: నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై (తదేకనిష్థులై) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా యభిప్రాయము.
******************************************************************************************* 2
యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే,
సర్వత్రగమచింత్యం చ
కూటస్థమచలం ధ్రువమ్‌.
సంనియ మ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః,
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతాః
ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీన పరచుకొని) ఎల్లడల సమభావముగలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తి గల వారై ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలింపనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.
******************************************************************************************* 3,4
క్లేశోధికతర స్తేషా
మవ్యక్తాసక్త చేతసామ్‌,
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే.
అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునం దాసక్తి గల మనస్సు గలవారికి (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగునోపాసకుల కంటె) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది.
******************************************************************************************* 5
యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరాః,
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయంత ఉపాసతే.
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్‌,
భవామి న చిరాత్పార్థ
మయ్యావేశిత చేతసామ్‌
ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నాయందు సమర్పించి, నన్నే పరమగతిగ దలచినవారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .
******************************************************************************************* 6,7
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః.
నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.
******************************************************************************************* 8
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్‌,
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ.
ఓ అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము).
******************************************************************************************* 9
అభ్యా సేప్యసమర్థోసి
మత్కర్మపరమో భవ,
మదర్థమపి కర్మాణి
కుర్వన్‌ సిద్ధి మవాప్స్యసి.
ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ వసమర్థుడవైతివేని నాసంబంధమైన కర్మలజేయుటయందాసక్తి గలవాడవుకమ్ము. అట్లు నా కొరకు కర్మలను జేయుచున్ననుగూడ నీవు మోక్షస్థితిని బడయగలవు.
******************************************************************************************* 10
అథై తదప్యశక్తోసి
కర్తుం మద్యోగమాశ్రితః,
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్‌.
ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించిన వాడవై దీనినిగుడ నాచరించుటకు శక్తుడవుకానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సుగలవాడవై సమస్త కర్మములయొక్క ఫలములను త్యజించివేయుము.
******************************************************************************************* 11
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌
జ్ఞానాద్ధ్యానం విశిష్యతే,
ధ్యానాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్ఛాంతిరనంతరమ్‌‌.
వివేకముతోగూడని అభ్యాసముకంటె (శాస్త్ర జన్య) జ్ఞానము శ్రేష్ఠమైనదికదా! (శాస్త్రజన్య) జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్ఠమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృత్తి యందును విషయ దోషము లేకుండుట శ్రేష్ఠమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ చిత్త) శాంతి లభించుచున్నది..
******************************************************************************************* 12
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ,
నిర్మమో నిరహంకారః
సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్ట స్సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి
ర్యోమద్భక్తస్స మే ప్రియః
సమస్త ప్రాణులయెడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరకుకొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 13, 14
మస్మాన్నో ద్విజతే లోకో
లోకాన్నో ద్విజతే చ యః,
హర్షామర్ష భయోద్వేగై
ర్ముక్తో యస్స చ మే ప్రియః.
ఎవని వలన ప్రపంచము (జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడొ, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు .
******************************************************************************************* 15
అనపేక్ష శ్శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః,
సర్వారంభ పరిత్యాగీ
యో మద్భక్తస్స మే ప్రియః.
కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతరశుద్ధిగలవాడును, కార్యసమర్థుడు (సమయస్ఫూప్తి గలవాడును) తటస్థుడును, దిగులు (దుఃఖము) లేనివాడును, సమస్త కార్యములందును కర్తృత్వమును వదలినవాడును (లేక సమస్తకామ్యకర్మలను, శాస్త్ర నిషిద్ధకర్మలను త్యజించినవాడును) నాయందు భక్తిగలవాడును, ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 16
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాంక్ష తి,
శుభాశుభ పరిత్యాగీ
భక్తిమాన్‌ యస్స మే ప్రియః.
ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును బొందడో, ఎవడు శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 17
సమశ్శత్రౌ చ మిత్రే చ
తథా మానావమానయోః,
శీతోష్ణసుఖదుఃఖేషు
సమస్సజ్గవివర్జితః.
తుల్యనిందాస్తుతిర్మౌనీ
సంతుష్టో యేన కేనచిత్‌,
అని కేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః
శత్రువునందును మిత్రునియందును, మానావమానములందును, శీతోష్ణ సుఖదుఃఖములందును సమముగ నుండువాడును, దేనియందును సంగము (ఆసక్తి, మనస్సంబంధము) లేనివాడును, నిందాస్తుతులందు సమముగ నుండువాడును, మౌనముతో నుండువాడును (లేక మననశీలుడును), దేనిచేతనైనను (దొరికినదానితో) తృప్తిని బోందువాడును, నిర్దిష్టమగు నివాసస్థానము లేనివాడును (లేక గృహాదులందాసక్తి లేనివాడును), నిశ్చయమగు బుద్ధిగలవాడును, భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 18, 19
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే,
శ్రద్ధధానా మత్పరమా
భక్తాస్తేతీవ మే ప్రియాః
ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి (నాయం దాసక్తి గలవారై) ఈ అమృతరూపమగు (మోక్షసాధనమైన) ధర్మమును (ఇప్పుడు చెప్పబడిన ప్రకారము) అనుష్ఠించుదురో అట్టిభక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.
******************************************************************************************* 20
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, భక్తియోగోనామ, ద్వాదశోధ్యాయః


TELUGU PURANA STORIES - BHANGARU MUNGISA STORY IN TELUGU


బంగారు ముంగిస-శ్రీ మహాభారతంలో కథలు

ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాల్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తుచేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేథయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు ధర్మరాజుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికీ కోటీవేల బంగారు నాణాలను ఇచ్చి తన రాజ్యమంతటినీ వేదవ్యాసమహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.

"ధర్మతనయా! నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు. కాని, నాకు బంగారం కావాలి. భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలకట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో" అన్నాడు మహర్షి.
"స్వామీ! అశ్వమేథయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా వుంటానిక. అంతేకాని బ్రహ్మధనాన్ని తిసుకుంటానా?" అన్నాడు ధర్మరాజు.
"రాజా! మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో" అన్నాడు వ్యాసముని.

"సరే అయితే!" అంటూ కోటికోట్ల మాడలు కుప్పగా పోసి, "ఇది ఈ భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు.

"రండి! మీకేం కావాలో చెప్పండి. ఇవిగో వస్త్రాలు! ధరించండి! రకరకాల బంగారు పాత్రలివిగో - స్వీకరించండి" అంటూ అందర్నీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు.

ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు. సిద్ధులూ విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.
తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగ సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే, అప్పుడొక చిత్రం జరిగింది.

ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటకి వచ్చి, "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా! సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేథయాగం?!" అంటూ మూతి విరిచింది.

ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. "అదేమిటి అలా అంటున్నావు. ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?" అని విప్రులు ముంగిసను ప్రశ్నించారు.

"అయ్యా! ఆకలిని, తృష్ణను జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావుమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యులు చేసి, "ఆరగించండి స్వామీ" అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండినీ భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నాతలా, శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి! ఇదీ ఆ సక్తుప్రస్ఫుడి ధర్మమహిమ!!

"మిగిలిన శరీరం కూడా బంగారుమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకూ తారసపడలేదు. ఈ నాడు ధర్మరాజు యాగం చేస్తున్నాడుకదా, నా కోరిక తీరకపోతూందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమయింది.


GODDESS SREE KANAKADURGA PRAYER


" ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః "
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | 
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ 
అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ 
కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ 
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ 
చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ 
తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే 
ఆదిత్యవ’ర్ణే తపసో‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః 
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే 
క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ 
గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ 
మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ 
కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ 
ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే 
ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ 
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్,
విందేయం పురు’షానహమ్ 
ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి 
తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ 
శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’

ఓం శాంతిః శాంతిః శాంతిః’